గత కొంత కాలంగా మల్లెమాల వారి జబర్దస్త్ కార్యక్రమం ఎన్నో ఒడి దుడుకులను ఎదుర్కొంటోంది. స్టార్ కమెడియన్లు దూరం కావడంతో ఈ షోకు రేటింగ్స్ బాగానే పడిపోయాయి. మరోవైపు రోజా వెళ్లిపోవడం, ఆ తరువాత మరికొందరు కమెడియన్లు కూడా దూరం అవడంతో.. షో కు ఆదరణ తగ్గిపోయింది. ఇక జబర్దస్త్కు యాంకర్ అనసూయ కూడా గుడ్ బై చెప్పేసింది. ఆమెకు వరుస సినిమా అవకాశాలు వస్తుండడంతో జబర్దస్త్కు డేట్స్ను అడ్జస్ట్ చేయలేకపోతున్నానని చెబుతూ కన్నీటి వీడ్కోలు తీసుకుంది. అయితే జబర్దస్త్లో అనసూయ తరువాత కొత్తగా ఎవరు యాంకర్గా వస్తారోనని ఇన్ని రోజుల పాటు సస్పెన్స్ నెలకొంది. కానీ ఎట్టకేలకు సస్పెన్స్ వీడిపోయింది. కొత్త యాంకర్ ఎవరు అన్నది బయట పెట్టేశారు.
జబర్దస్త్కు అనసూయ అనంతరం మంజూష యాంకర్గా వస్తుందని జోరుగా ప్రచారం చేశారు. ఈ మేరకు వార్తలు హల్ చల్ చేశాయి కూడా. అయితే అకస్మాత్తుగా రష్మి గౌతమ్నే మళ్లీ జబర్దస్త్కు కూడా యాంకర్గా తెచ్చారు. గత వారం విడుదలైన ప్రోమోలో పల్లకిలో కొత్త యాంకర్ను మోసుకువచ్చారు. దీంతో ఆమె మంజూషనే అయి ఉంటుందని అనుకున్నారు. కానీ కాదు. యాంకర్ రష్మినే జబర్దస్త్కు కూడా యాంకర్గా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అయితే వాస్తవానికి గతంలో అనసూయ జబర్దస్త్ నుంచి వెళ్లిపోయినప్పుడు కూడా కొంత కాలం పాటు రష్మినే రెండు కార్యక్రమాలకు యాంకర్గా కొనసాగింది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్.. ఇలా రెండింటికీ ఆమెనే యాంకర్గా చేసింది. ఆ తరువాత అనసూయ రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆమెకు మళ్లీ జబర్దస్త్లో యాంకర్గా అవకాశం ఇచ్చారు. దీంతో రష్మి ఎక్స్ట్రా జబర్దస్త్కే పరిమితం అయింది. అయితే ఇప్పుడు మళ్లీ జబర్దస్త్ బాధ్యతలను తీసుకుంది. దీంతో ఆమె మళ్లీ రెండు షోలకూ యాంకర్గా కొనసాగనుంది.
ఇక మల్లెమాల వారు నిర్వహిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా రష్మినే యాంకర్గా ఉంది. దీంతో మొత్తంగా వారి భవిష్యత్తు అంతా రష్మి చేతుల్లోనే ఉందన్నమాట. మరి ఈ అమ్మడు ఇప్పుడు ఈ మూడు కార్యక్రమాలకు యాంకర్గా వ్యవహరిస్తూ షోకు ఎలాంటి రేటింగ్స్ తెప్పిస్తుందో చూడాలి. చాలా మంది దూరం అయిన నేపథ్యంలో జబర్దస్త్ షోస్ ఇకపై ఎలా కొనసాగుతాయో కూడా చూడాలి. ఈ రిజల్ట్ రానున్న రోజుల్లో తేలనుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…