స‌స్పెన్స్ వీడిపోయింది.. జ‌బ‌ర్ద‌స్త్ కొత్త యాంక‌ర్ ఎవ‌రో తెలిసిపోయింది..!

గ‌త కొంత కాలంగా మ‌ల్లెమాల వారి జ‌బ‌ర్ద‌స్త్ కార్య‌క్ర‌మం ఎన్నో ఒడి దుడుకుల‌ను ఎదుర్కొంటోంది. స్టార్ క‌మెడియ‌న్లు దూరం కావ‌డంతో ఈ షోకు రేటింగ్స్ బాగానే ప‌డిపోయాయి. మ‌రోవైపు రోజా వెళ్లిపోవ‌డం, ఆ త‌రువాత మ‌రికొంద‌రు క‌మెడియ‌న్లు కూడా దూరం అవ‌డంతో.. షో కు ఆద‌ర‌ణ త‌గ్గిపోయింది. ఇక జ‌బ‌ర్ద‌స్త్‌కు యాంక‌ర్ అన‌సూయ కూడా గుడ్ బై చెప్పేసింది. ఆమెకు వ‌రుస సినిమా అవ‌కాశాలు వ‌స్తుండ‌డంతో జ‌బ‌ర్ద‌స్త్‌కు డేట్స్‌ను అడ్జ‌స్ట్ చేయ‌లేక‌పోతున్నాన‌ని చెబుతూ క‌న్నీటి వీడ్కోలు తీసుకుంది. అయితే జ‌బ‌ర్ద‌స్త్‌లో అన‌సూయ త‌రువాత కొత్త‌గా ఎవ‌రు యాంక‌ర్‌గా వ‌స్తారోన‌ని ఇన్ని రోజుల పాటు స‌స్పెన్స్ నెల‌కొంది. కానీ ఎట్ట‌కేల‌కు సస్పెన్స్ వీడిపోయింది. కొత్త యాంక‌ర్ ఎవ‌రు అన్న‌ది బ‌య‌ట పెట్టేశారు.

జ‌బ‌ర్ద‌స్త్‌కు అన‌సూయ అనంత‌రం మంజూష యాంక‌ర్‌గా వ‌స్తుంద‌ని జోరుగా ప్ర‌చారం చేశారు. ఈ మేర‌కు వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి కూడా. అయితే అక‌స్మాత్తుగా ర‌ష్మి గౌత‌మ్‌నే మ‌ళ్లీ జ‌బ‌ర్ద‌స్త్‌కు కూడా యాంక‌ర్‌గా తెచ్చారు. గ‌త వారం విడుద‌లైన ప్రోమోలో ప‌ల్ల‌కిలో కొత్త యాంక‌ర్‌ను మోసుకువచ్చారు. దీంతో ఆమె మంజూష‌నే అయి ఉంటుంద‌ని అనుకున్నారు. కానీ కాదు. యాంక‌ర్ ర‌ష్మినే జ‌బ‌ర్ద‌స్త్‌కు కూడా యాంక‌ర్‌గా కొన‌సాగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో ఈ వార్త సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

అయితే వాస్త‌వానికి గ‌తంలో అన‌సూయ జ‌బ‌ర్ద‌స్త్ నుంచి వెళ్లిపోయిన‌ప్పుడు కూడా కొంత కాలం పాటు ర‌ష్మినే రెండు కార్య‌క్ర‌మాల‌కు యాంక‌ర్‌గా కొన‌సాగింది. జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌.. ఇలా రెండింటికీ ఆమెనే యాంక‌ర్‌గా చేసింది. ఆ త‌రువాత అన‌సూయ రీ ఎంట్రీ ఇవ్వ‌డంతో ఆమెకు మ‌ళ్లీ జ‌బ‌ర్ద‌స్త్‌లో యాంక‌ర్‌గా అవ‌కాశం ఇచ్చారు. దీంతో ర‌ష్మి ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌కే పరిమితం అయింది. అయితే ఇప్పుడు మ‌ళ్లీ జ‌బ‌ర్ద‌స్త్ బాధ్య‌త‌ల‌ను తీసుకుంది. దీంతో ఆమె మ‌ళ్లీ రెండు షోల‌కూ యాంక‌ర్‌గా కొన‌సాగ‌నుంది.

ఇక మ‌ల్లెమాల వారు నిర్వ‌హిస్తున్న శ్రీ‌దేవి డ్రామా కంపెనీకి కూడా ర‌ష్మినే యాంక‌ర్‌గా ఉంది. దీంతో మొత్తంగా వారి భ‌విష్య‌త్తు అంతా ర‌ష్మి చేతుల్లోనే ఉంద‌న్న‌మాట‌. మ‌రి ఈ అమ్మ‌డు ఇప్పుడు ఈ మూడు కార్య‌క్ర‌మాల‌కు యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ షోకు ఎలాంటి రేటింగ్స్ తెప్పిస్తుందో చూడాలి. చాలా మంది దూరం అయిన నేప‌థ్యంలో జ‌బ‌ర్ద‌స్త్ షోస్ ఇక‌పై ఎలా కొన‌సాగుతాయో కూడా చూడాలి. ఈ రిజ‌ల్ట్ రానున్న రోజుల్లో తేల‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM