గత కొంత కాలంగా మల్లెమాల వారి జబర్దస్త్ కార్యక్రమం ఎన్నో ఒడి దుడుకులను ఎదుర్కొంటోంది. స్టార్ కమెడియన్లు దూరం కావడంతో ఈ షోకు రేటింగ్స్ బాగానే పడిపోయాయి. మరోవైపు రోజా వెళ్లిపోవడం, ఆ తరువాత మరికొందరు కమెడియన్లు కూడా దూరం అవడంతో.. షో కు ఆదరణ తగ్గిపోయింది. ఇక జబర్దస్త్కు యాంకర్ అనసూయ కూడా గుడ్ బై చెప్పేసింది. ఆమెకు వరుస సినిమా అవకాశాలు వస్తుండడంతో జబర్దస్త్కు డేట్స్ను అడ్జస్ట్ చేయలేకపోతున్నానని చెబుతూ కన్నీటి వీడ్కోలు తీసుకుంది. అయితే జబర్దస్త్లో అనసూయ తరువాత కొత్తగా ఎవరు యాంకర్గా వస్తారోనని ఇన్ని రోజుల పాటు సస్పెన్స్ నెలకొంది. కానీ ఎట్టకేలకు సస్పెన్స్ వీడిపోయింది. కొత్త యాంకర్ ఎవరు అన్నది బయట పెట్టేశారు.
జబర్దస్త్కు అనసూయ అనంతరం మంజూష యాంకర్గా వస్తుందని జోరుగా ప్రచారం చేశారు. ఈ మేరకు వార్తలు హల్ చల్ చేశాయి కూడా. అయితే అకస్మాత్తుగా రష్మి గౌతమ్నే మళ్లీ జబర్దస్త్కు కూడా యాంకర్గా తెచ్చారు. గత వారం విడుదలైన ప్రోమోలో పల్లకిలో కొత్త యాంకర్ను మోసుకువచ్చారు. దీంతో ఆమె మంజూషనే అయి ఉంటుందని అనుకున్నారు. కానీ కాదు. యాంకర్ రష్మినే జబర్దస్త్కు కూడా యాంకర్గా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అయితే వాస్తవానికి గతంలో అనసూయ జబర్దస్త్ నుంచి వెళ్లిపోయినప్పుడు కూడా కొంత కాలం పాటు రష్మినే రెండు కార్యక్రమాలకు యాంకర్గా కొనసాగింది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్.. ఇలా రెండింటికీ ఆమెనే యాంకర్గా చేసింది. ఆ తరువాత అనసూయ రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆమెకు మళ్లీ జబర్దస్త్లో యాంకర్గా అవకాశం ఇచ్చారు. దీంతో రష్మి ఎక్స్ట్రా జబర్దస్త్కే పరిమితం అయింది. అయితే ఇప్పుడు మళ్లీ జబర్దస్త్ బాధ్యతలను తీసుకుంది. దీంతో ఆమె మళ్లీ రెండు షోలకూ యాంకర్గా కొనసాగనుంది.
ఇక మల్లెమాల వారు నిర్వహిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా రష్మినే యాంకర్గా ఉంది. దీంతో మొత్తంగా వారి భవిష్యత్తు అంతా రష్మి చేతుల్లోనే ఉందన్నమాట. మరి ఈ అమ్మడు ఇప్పుడు ఈ మూడు కార్యక్రమాలకు యాంకర్గా వ్యవహరిస్తూ షోకు ఎలాంటి రేటింగ్స్ తెప్పిస్తుందో చూడాలి. చాలా మంది దూరం అయిన నేపథ్యంలో జబర్దస్త్ షోస్ ఇకపై ఎలా కొనసాగుతాయో కూడా చూడాలి. ఈ రిజల్ట్ రానున్న రోజుల్లో తేలనుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…