Rajnikath : సూపర్ స్టార్ రజనీకాంత్ కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి ప్రతిష్టాత్మక `దాదా సాహెబ్ ఫాల్కే` అవార్డుని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అందుకున్న విషయం తెలిసిందే. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన విశేష సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారంతో గౌరవించింది. ఈ సందర్భంగా రజనీకాంత్ అటు ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ని కలిశారు.
ఢిల్లీ నుండి వచ్చాక రజనీకాంత్కి ఒంట్లో నలతగా అనిపించడంతో కావేరీ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయన్ని పరిశీలించి మెదడులోని నరాల్లో ఏవో బ్లాక్స్ ఉన్నాయని గుర్తించి చికిత్స అందించారు. కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ శస్త్ర చికిత్స చేయించుకోవాలని వైద్యులు ఈ సందర్భంగా ఆయనకు సూచించారు. రజనీ ఓకే చెప్పడంతో వెంటనే శస్త్ర చికిత్స నిర్వహించారు. అది విజయవంతం కావడంతో ఆసుపత్రిలో రెండు రోజులు విశ్రాంతి తీసుకున్న తలైవా ఆదివారం రాత్రి ఇంటికి వచ్చారు.
నా చికిత్స పూర్తయ్యింది. ఆదివారం రాత్రి ఇంటికి చేరుకున్నాను. నా ఆరోగ్యం బాగు పడాలని ప్రార్థనలు చేసిన నా మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులకు హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. అని రజనీకాంత్ పేర్కొన్నారు. రజనీకాంత్ లేటెస్ట్ మూవీ అన్నాత్తె (పెద్దన్న) దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. తలైవర్ అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…