Rajnikath : సూపర్ స్టార్ రజనీకాంత్ కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి ప్రతిష్టాత్మక `దాదా సాహెబ్ ఫాల్కే` అవార్డుని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అందుకున్న విషయం తెలిసిందే. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన విశేష సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారంతో గౌరవించింది. ఈ సందర్భంగా రజనీకాంత్ అటు ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ని కలిశారు.
ఢిల్లీ నుండి వచ్చాక రజనీకాంత్కి ఒంట్లో నలతగా అనిపించడంతో కావేరీ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయన్ని పరిశీలించి మెదడులోని నరాల్లో ఏవో బ్లాక్స్ ఉన్నాయని గుర్తించి చికిత్స అందించారు. కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ శస్త్ర చికిత్స చేయించుకోవాలని వైద్యులు ఈ సందర్భంగా ఆయనకు సూచించారు. రజనీ ఓకే చెప్పడంతో వెంటనే శస్త్ర చికిత్స నిర్వహించారు. అది విజయవంతం కావడంతో ఆసుపత్రిలో రెండు రోజులు విశ్రాంతి తీసుకున్న తలైవా ఆదివారం రాత్రి ఇంటికి వచ్చారు.
నా చికిత్స పూర్తయ్యింది. ఆదివారం రాత్రి ఇంటికి చేరుకున్నాను. నా ఆరోగ్యం బాగు పడాలని ప్రార్థనలు చేసిన నా మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులకు హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. అని రజనీకాంత్ పేర్కొన్నారు. రజనీకాంత్ లేటెస్ట్ మూవీ అన్నాత్తె (పెద్దన్న) దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. తలైవర్ అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…