Evaru Meelo Koteeshwarulu : వెండితెరపై సంచలనాలు సృష్టించిన ఎన్టీఆర్ ఇప్పుడు బుల్లితెరపై కూడా సత్తా చాటుతున్నారు. ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంలో సామాన్యులతోపాటు సెలబ్రిటీలతోనూ సందడి చేస్తున్నారు. మొదటి, రెండు వారాలు ఈ షోకు మంచి రేటింగ్స్ వచ్చినా.. ఆ తర్వాత రాను రాను ఈ షో రేటింగ్ తగ్గుతూ వస్తోంది. ఈ షో కోసం కంటెస్టెంట్ లతో ఎంతో కష్టపడుతున్నా రేటింగ్స్ మాత్రం ఆ రేంజ్లో మాత్రం రావడం లేదు.
రేటింగ్ మరింత పెంచేందుకు సెలబ్స్ని కూడా తీసుకొస్తున్నారు. తొలి ఎపిసోడ్కే రామ్ చరణ్ హోస్ట్గా రాగా, ఆ తర్వాత రాజమౌళి, సుకుమార్, సమంత వంటి వారు హాజరయ్యారు. త్వరలో మహేష్ బాబు కూడా హాజరు కానున్నారు. దీపావళి సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకులు షోలో ఎన్టీఆర్తో సందడి చేశారు. ఈ షోలోకి తమన్, దేవిశ్రీ ప్రసాద్ హాజరు కాగా, ‘మీలో తుంబురుడు, నారదుడు ఎవరు’ అని ఎన్టీఆర్ వారిద్దరినీ ప్రశ్నించారు.
‘ఎవరు మీలో కోటీశ్వరులు’ పాటను తనదైన శైలిలో పాడి దేవిశ్రీ అలరించగా, అందుకు ఎన్టీఆర్ కోరస్ పాడారు. ఇక ‘పంచ్ కోసం పంచ్ ఇచ్చి ప్రాణాలు తీసేస్తా.. కాన్ఫిడెంట్’ అని ఎన్టీఆర్ అంటే, ‘ఓవర్ కాన్ఫిడెంట్’ అంటూ తమన్ చెప్పడంతో నవ్వులు విరిశాయి. దీపావళి కానుకగా ఈ స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ షో చివరి షెడ్యూల్ షూటింగ్ పూర్తైయిందని నవంబర్ 18న పూర్తి కానున్న షోకి మహేష్ బాబు హాజరు కానున్నారని తెలుస్తోంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…