ఏపీ అసెంబ్లీలో తనపై, తన భార్య భువనేశ్వరిపై అసభ్య పదజాలం ఉపయోగించారని, దారుణమైన వ్యాఖ్యలు చేశారని.. చెబుతూ చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లో గుక్క పెట్టి ఏడ్చారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబును ఓదారుస్తూ రజనీకాంత్ ఫోన్ కాల్ చేశారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇదంతా వట్టి ప్రచారమేనని, చంద్రబాబుకు సింపతీ వచ్చేందుకు టీడీపీలోని ఓ వర్గమే ఇలా ప్రచారం చేస్తుందని వార్తలు వస్తున్నాయి.
ఇటీవల పట్టాభి వ్యాఖ్యల అనంతరం ఏపీలో జరిగిన పరిణామాలపై ఫిర్యాదు చేసేందుకు బాబు ఢిల్లీ వెళ్లగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో అపాయింట్మెంట్ లభించలేదు. దీంతో బాబు రాష్ట్రపతికి ఫిర్యాదు చేసి వెనక్కి వచ్చేశారు. తరువాత అమిత్ షా ఫోన్ చేశారని కలరింగ్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.
ఇక ఇప్పుడు కూడా సింపతీ కొట్టేసేందుకే రజనీకాంత్ పేరును టీడీపీ వాడుకుంటుందని.. మీడియాలో కొన్ని వర్గాలు అంటున్నాయి. రజనీకాంత్ నిజంగానే ఫోన్ కాల్ చేసి ఉంటే ఆ విషయాన్ని ఆయన తన సోషల్ ఖాతాల ద్వారా వెల్లడించేవారని.. అధికారికంగా కన్ఫాం చేసేవారని.. కానీ ఆయన అలా చేయలేదు.. కనుక ఆయన చంద్రబాబుకు ఫోన్ కాల్ చేశారన్న మాట కూడా అవాస్తవమేనని అంటున్నారు.
ఇటీవల జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో ఘోర ఓటమి పాలైనందుకు.. తాజాగా ఏపీలో జరిగిన పరిణామాలపై పార్టీ పట్ల ప్రజల్లో సింపతీ కొట్టేసేందుకే టీడీపీలోని కొందరు ఇలా ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారని.. చర్చ నడుస్తోంది. మరి ఇందులో నిజం ఎంత ఉంది ? అన్నది తెలియాల్సి ఉంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…