ఏపీ అసెంబ్లీలో తనపై, తన భార్య భువనేశ్వరిపై అసభ్య పదజాలం ఉపయోగించారని, దారుణమైన వ్యాఖ్యలు చేశారని.. చెబుతూ చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లో గుక్క పెట్టి ఏడ్చారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబును ఓదారుస్తూ రజనీకాంత్ ఫోన్ కాల్ చేశారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇదంతా వట్టి ప్రచారమేనని, చంద్రబాబుకు సింపతీ వచ్చేందుకు టీడీపీలోని ఓ వర్గమే ఇలా ప్రచారం చేస్తుందని వార్తలు వస్తున్నాయి.
ఇటీవల పట్టాభి వ్యాఖ్యల అనంతరం ఏపీలో జరిగిన పరిణామాలపై ఫిర్యాదు చేసేందుకు బాబు ఢిల్లీ వెళ్లగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో అపాయింట్మెంట్ లభించలేదు. దీంతో బాబు రాష్ట్రపతికి ఫిర్యాదు చేసి వెనక్కి వచ్చేశారు. తరువాత అమిత్ షా ఫోన్ చేశారని కలరింగ్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.
ఇక ఇప్పుడు కూడా సింపతీ కొట్టేసేందుకే రజనీకాంత్ పేరును టీడీపీ వాడుకుంటుందని.. మీడియాలో కొన్ని వర్గాలు అంటున్నాయి. రజనీకాంత్ నిజంగానే ఫోన్ కాల్ చేసి ఉంటే ఆ విషయాన్ని ఆయన తన సోషల్ ఖాతాల ద్వారా వెల్లడించేవారని.. అధికారికంగా కన్ఫాం చేసేవారని.. కానీ ఆయన అలా చేయలేదు.. కనుక ఆయన చంద్రబాబుకు ఫోన్ కాల్ చేశారన్న మాట కూడా అవాస్తవమేనని అంటున్నారు.
ఇటీవల జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో ఘోర ఓటమి పాలైనందుకు.. తాజాగా ఏపీలో జరిగిన పరిణామాలపై పార్టీ పట్ల ప్రజల్లో సింపతీ కొట్టేసేందుకే టీడీపీలోని కొందరు ఇలా ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారని.. చర్చ నడుస్తోంది. మరి ఇందులో నిజం ఎంత ఉంది ? అన్నది తెలియాల్సి ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…