కేంద్ర ప్రభుత్వం తాన అమలులోకి తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. ప్రధాని మోదీ తాజాగా ఈ ప్రకటన చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రక్రియ ద్వారా ఆ చట్టాలను రద్దు చేస్తామన్నారు. అయితే చట్టాలను రద్దు చేశాకే తమ ఆందోళనలను నిలిపివేస్తామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి.
ఇక రైతులు చేస్తున్న ఆందోళనలకు ప్రకాష్ రాజ్ మొదటి నుంచీ మద్దతుగా నిలుస్తూ వచ్చారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ను కోట్ చేస్తూ.. ప్రధాని మోదీపై ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేశారు. కేవలం రైతులకు క్షమాపణలు చెబితే సరిపోదని, మరణించిన రైతుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
కాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఆందోళనల్లో చనిపోయిన 750 మందికి పైగా రైతులకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని ఇటీవలే ప్రకటన చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. కేంద్రం ఒక్కో రైతు కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ట్వీట్ ను కోట్ చేస్తూ ప్రకాష్ రాజ్ తాజాగా మోదీపై వ్యాఖ్యలు చేశారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…