కేంద్ర ప్రభుత్వం తాన అమలులోకి తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. ప్రధాని మోదీ తాజాగా ఈ ప్రకటన చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రక్రియ ద్వారా ఆ చట్టాలను రద్దు చేస్తామన్నారు. అయితే చట్టాలను రద్దు చేశాకే తమ ఆందోళనలను నిలిపివేస్తామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి.
ఇక రైతులు చేస్తున్న ఆందోళనలకు ప్రకాష్ రాజ్ మొదటి నుంచీ మద్దతుగా నిలుస్తూ వచ్చారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ను కోట్ చేస్తూ.. ప్రధాని మోదీపై ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేశారు. కేవలం రైతులకు క్షమాపణలు చెబితే సరిపోదని, మరణించిన రైతుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
కాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఆందోళనల్లో చనిపోయిన 750 మందికి పైగా రైతులకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని ఇటీవలే ప్రకటన చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. కేంద్రం ఒక్కో రైతు కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ట్వీట్ ను కోట్ చేస్తూ ప్రకాష్ రాజ్ తాజాగా మోదీపై వ్యాఖ్యలు చేశారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…