కేంద్ర ప్రభుత్వం తాన అమలులోకి తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. ప్రధాని మోదీ తాజాగా ఈ ప్రకటన చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రక్రియ ద్వారా ఆ చట్టాలను రద్దు చేస్తామన్నారు. అయితే చట్టాలను రద్దు చేశాకే తమ ఆందోళనలను నిలిపివేస్తామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి.
ఇక రైతులు చేస్తున్న ఆందోళనలకు ప్రకాష్ రాజ్ మొదటి నుంచీ మద్దతుగా నిలుస్తూ వచ్చారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ను కోట్ చేస్తూ.. ప్రధాని మోదీపై ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేశారు. కేవలం రైతులకు క్షమాపణలు చెబితే సరిపోదని, మరణించిన రైతుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
కాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఆందోళనల్లో చనిపోయిన 750 మందికి పైగా రైతులకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని ఇటీవలే ప్రకటన చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. కేంద్రం ఒక్కో రైతు కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ట్వీట్ ను కోట్ చేస్తూ ప్రకాష్ రాజ్ తాజాగా మోదీపై వ్యాఖ్యలు చేశారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…