Raja Ravindra : ప్రముఖ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు రాజా రవీంద్ర. రాజా రవీంద్ర మొదట హీరోగా చేసిన కొన్ని సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సినీ ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే ఈయన నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాదు పలువురు హీరోలకి మేనేజర్ గా కూడా వర్క్ చేశాడు. తెలుగులో నిఖిల్, నవీన్ చంద్ర, మంచు విష్ణు, రాజ్ తరుణ్ ఒకప్పుడు రవితేజ, స్టార్ హీరోస్ కి కూడా మేనేజర్ గా చేశాడు. రవితేజ రాజా రవీంద్ర వల్లే ఈ స్థాయిలో ఉన్నారటంలో సందేహం లేదు. ఎందుకంటే రవితేజ సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేస్తూ రవితేజను గైడ్ చేస్తూ వచ్చాడు.
తర్వాత కొన్ని కారణాలతో వీరిద్దరికీ మ్యాటర్ చెడింది అని.. అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇటీవల రాజా రవీంద్ర ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశాడు. స్టార్ హీరోలకు మేనేజర్ గా ఉన్న మీరు హీరోయిన్లకు ఎందుకు భయపడిపోతారు ? హీరోయిన్లు మిమ్మల్ని మేనేజర్ గా అడిగితే నో చెప్పారట.. నిజమేనా ? అని యాంకర్ అడగ్గా.. రాజా రవీంద్ర మాట్లాడుతూ.. నేను హీరోలకి మేనేజర్ గా చేశాను.. కానీ, హీరోయిన్లకి ఎందుకు చేయడం లేదంటే దానికి కారణం సౌందర్యనే. హీరోలు 2,3 సినిమాలు ఓకే చేసి.. అవి కంప్లీట్ అయ్యాకే మిగతా సినిమాలకు వెళ్తారు. కానీ హీరోయిన్స్ మాత్రం ఒకేసారి 5,6 సినిమాలు ఓకే చేస్తారు.
ఈ రోజు ఇక్కడ ఉంటే.. రేపు చెన్నైలో ఉండాలి అలా కొన్నిసార్లు లేట్ అవుతుంది. ఫ్లైట్స్ డిలే అవుతాయి. ఒక సందర్భంలో సౌందర్య ఒకేసారి 3 సినిమాలు ఒప్పుకొని ఎంత ఇబ్బంది పడిందో కళ్లారా చూశాను. హిందీలో అమితాబచ్చన్ సినిమా.. తెలుగులో చిరంజీవి సినిమా.. తమిళ్ లో రజనీకాంత్ సినిమా.. మూడు సినిమాలను ఒకేసారి ఒకే చేసి ఆ టైంలో డేట్స్ సరిగ్గా అడ్జస్ట్ చేయలేక వాళ్ళ మేనేజర్ పడ్డ కష్టాలు అంతా ఇంతా కాదు. అది చూశాక నేను భవిష్యత్తులో ఎప్పుడూ హీరోయిన్స్ కి మేనేజర్ గా ఉండకూడదని నిర్ణయించుకున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో రాజా రవీంద్ర మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ల మేనేజర్లు ఇంత కష్టపడతారా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…