Raja Ravindra : ప్రముఖ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు రాజా రవీంద్ర. రాజా రవీంద్ర మొదట హీరోగా చేసిన కొన్ని సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సినీ ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే ఈయన నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాదు పలువురు హీరోలకి మేనేజర్ గా కూడా వర్క్ చేశాడు. తెలుగులో నిఖిల్, నవీన్ చంద్ర, మంచు విష్ణు, రాజ్ తరుణ్ ఒకప్పుడు రవితేజ, స్టార్ హీరోస్ కి కూడా మేనేజర్ గా చేశాడు. రవితేజ రాజా రవీంద్ర వల్లే ఈ స్థాయిలో ఉన్నారటంలో సందేహం లేదు. ఎందుకంటే రవితేజ సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేస్తూ రవితేజను గైడ్ చేస్తూ వచ్చాడు.
తర్వాత కొన్ని కారణాలతో వీరిద్దరికీ మ్యాటర్ చెడింది అని.. అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇటీవల రాజా రవీంద్ర ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశాడు. స్టార్ హీరోలకు మేనేజర్ గా ఉన్న మీరు హీరోయిన్లకు ఎందుకు భయపడిపోతారు ? హీరోయిన్లు మిమ్మల్ని మేనేజర్ గా అడిగితే నో చెప్పారట.. నిజమేనా ? అని యాంకర్ అడగ్గా.. రాజా రవీంద్ర మాట్లాడుతూ.. నేను హీరోలకి మేనేజర్ గా చేశాను.. కానీ, హీరోయిన్లకి ఎందుకు చేయడం లేదంటే దానికి కారణం సౌందర్యనే. హీరోలు 2,3 సినిమాలు ఓకే చేసి.. అవి కంప్లీట్ అయ్యాకే మిగతా సినిమాలకు వెళ్తారు. కానీ హీరోయిన్స్ మాత్రం ఒకేసారి 5,6 సినిమాలు ఓకే చేస్తారు.
ఈ రోజు ఇక్కడ ఉంటే.. రేపు చెన్నైలో ఉండాలి అలా కొన్నిసార్లు లేట్ అవుతుంది. ఫ్లైట్స్ డిలే అవుతాయి. ఒక సందర్భంలో సౌందర్య ఒకేసారి 3 సినిమాలు ఒప్పుకొని ఎంత ఇబ్బంది పడిందో కళ్లారా చూశాను. హిందీలో అమితాబచ్చన్ సినిమా.. తెలుగులో చిరంజీవి సినిమా.. తమిళ్ లో రజనీకాంత్ సినిమా.. మూడు సినిమాలను ఒకేసారి ఒకే చేసి ఆ టైంలో డేట్స్ సరిగ్గా అడ్జస్ట్ చేయలేక వాళ్ళ మేనేజర్ పడ్డ కష్టాలు అంతా ఇంతా కాదు. అది చూశాక నేను భవిష్యత్తులో ఎప్పుడూ హీరోయిన్స్ కి మేనేజర్ గా ఉండకూడదని నిర్ణయించుకున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో రాజా రవీంద్ర మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ల మేనేజర్లు ఇంత కష్టపడతారా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…