Rana Daggubati : టాలీవుడ్ ను శాసిస్తున్న కుటుంబాల గురించి అందరికీ తెలిసిందే.. అయితే సినిమాల విషయంలో ఆ కుటుంబాల మధ్య పోటీ ఉన్నప్పటికీ ఫ్యామిలీ మ్యాటర్ కి వచ్చేసరికి అంతా ఒక్కటే అన్నట్టు వరుసలు కలుపుకు తిరుగుతారు. అలా టాలీవుడ్లో అక్కినేని, నందమూరి, దగ్గుబాటి ఫ్యామిలీలది ఐదారు దశాబ్దాల అనుబంధం. ఈ మూడు కుటుంబాల మధ్య అనుబంధం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆ మాటకు వస్తే ఏఎన్నార్ – రామానాయుడు ఏకంగా వియ్యంకులే అయ్యారు. అలాగే ఇటు దగ్గుబాటి, నందమూరి, నందమూరి, అక్కినేని ఫ్యామిలీ బంధాలు కూడా బాగానే ఉన్నాయి. అయితే నందమూరి, దగ్గుబాటి వంశాల్లో మూడో తరం హీరోలుగా జూనియర్ ఎన్టీఆర్, రానా కొనసాగుతున్నారు.
బాహుబలితో రానా, ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్లు అయిపోయారు. వీరిద్దరూ పాన్ ఇండియా స్టార్స్ అయినప్పటికీ ఎక్కడా ఫ్యాన్స్ ని రెచ్చగొట్టడం, ఈగోలకి వెళ్లడం లాంటివి ఎప్పుడు చేయలేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నారని చెప్పొచ్చు. ఇండస్ట్రీలో ఫ్యాన్ వార్ తీవ్రంగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్, రానా సింపుల్ గా ఉండడంతో వీరి ఫ్యాన్స్ కూడా వివాదాలకు దూరంగా ఉన్నారు. అయితే వ్యక్తిగతంగా రానా, ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్ అని మనకు తెలిసిందే. అంతేకాదు ఒకరినొకరు బావ, బావ అని పిలుచుకుంటూ ఉంటారు. సురేష్బాబును ఎన్టీఆర్ ముద్దుగా మావా అని పిలుస్తుంటాడు.
ఎన్టీఆర్ హోస్ట్ గా ఉన్న మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్కు ఓసారి రామ్చరణ్ గెస్ట్ గా వచ్చాడు. ఫోన్ ఇన్ ఫ్రెండ్ కాల్కు చరణ్ రానాకే ఫోన్ చేశాడు. ఫోన్ కలిసిన వెంటనే రానా, ఎన్టీఆర్ ఒకరినొకరు బావ, బావ అని పిలుచుకున్నారు. బావ మీ ఎపిసోడ్ మేకింగ్ వీడియో ఏకంగా 10 సార్లు చూశానని.. తాను మెస్మరైజ్ అయిపోయానని రానా చెప్పగా.. వెంటనే తారక్ థ్యాంక్యూ బావా అని రానాకు అప్యాయంగా చెప్పాడు. ఇక బయట కూడా రానా, ఎన్టీఆర్ మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య మంచి రిలేషన్ ఉండడం వల్ల ఫ్యాన్స్ కూడా బాగా ఖుషి అవుతున్నారు. పాన్ ఇండియా హీరోలైనప్పటికీ ఒద్దికగా ఉండి, మంచి బాండింగ్ మెయింటైన్ చేస్తున్నందుకు రానా, ఎన్టీఆర్ లను అభినందించాల్సిందే.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…