Rana Daggubati : టాలీవుడ్ ను శాసిస్తున్న కుటుంబాల గురించి అందరికీ తెలిసిందే.. అయితే సినిమాల విషయంలో ఆ కుటుంబాల మధ్య పోటీ ఉన్నప్పటికీ ఫ్యామిలీ మ్యాటర్ కి వచ్చేసరికి అంతా ఒక్కటే అన్నట్టు వరుసలు కలుపుకు తిరుగుతారు. అలా టాలీవుడ్లో అక్కినేని, నందమూరి, దగ్గుబాటి ఫ్యామిలీలది ఐదారు దశాబ్దాల అనుబంధం. ఈ మూడు కుటుంబాల మధ్య అనుబంధం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆ మాటకు వస్తే ఏఎన్నార్ – రామానాయుడు ఏకంగా వియ్యంకులే అయ్యారు. అలాగే ఇటు దగ్గుబాటి, నందమూరి, నందమూరి, అక్కినేని ఫ్యామిలీ బంధాలు కూడా బాగానే ఉన్నాయి. అయితే నందమూరి, దగ్గుబాటి వంశాల్లో మూడో తరం హీరోలుగా జూనియర్ ఎన్టీఆర్, రానా కొనసాగుతున్నారు.
బాహుబలితో రానా, ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్లు అయిపోయారు. వీరిద్దరూ పాన్ ఇండియా స్టార్స్ అయినప్పటికీ ఎక్కడా ఫ్యాన్స్ ని రెచ్చగొట్టడం, ఈగోలకి వెళ్లడం లాంటివి ఎప్పుడు చేయలేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నారని చెప్పొచ్చు. ఇండస్ట్రీలో ఫ్యాన్ వార్ తీవ్రంగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్, రానా సింపుల్ గా ఉండడంతో వీరి ఫ్యాన్స్ కూడా వివాదాలకు దూరంగా ఉన్నారు. అయితే వ్యక్తిగతంగా రానా, ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్ అని మనకు తెలిసిందే. అంతేకాదు ఒకరినొకరు బావ, బావ అని పిలుచుకుంటూ ఉంటారు. సురేష్బాబును ఎన్టీఆర్ ముద్దుగా మావా అని పిలుస్తుంటాడు.
ఎన్టీఆర్ హోస్ట్ గా ఉన్న మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్కు ఓసారి రామ్చరణ్ గెస్ట్ గా వచ్చాడు. ఫోన్ ఇన్ ఫ్రెండ్ కాల్కు చరణ్ రానాకే ఫోన్ చేశాడు. ఫోన్ కలిసిన వెంటనే రానా, ఎన్టీఆర్ ఒకరినొకరు బావ, బావ అని పిలుచుకున్నారు. బావ మీ ఎపిసోడ్ మేకింగ్ వీడియో ఏకంగా 10 సార్లు చూశానని.. తాను మెస్మరైజ్ అయిపోయానని రానా చెప్పగా.. వెంటనే తారక్ థ్యాంక్యూ బావా అని రానాకు అప్యాయంగా చెప్పాడు. ఇక బయట కూడా రానా, ఎన్టీఆర్ మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య మంచి రిలేషన్ ఉండడం వల్ల ఫ్యాన్స్ కూడా బాగా ఖుషి అవుతున్నారు. పాన్ ఇండియా హీరోలైనప్పటికీ ఒద్దికగా ఉండి, మంచి బాండింగ్ మెయింటైన్ చేస్తున్నందుకు రానా, ఎన్టీఆర్ లను అభినందించాల్సిందే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…