Naga Chaitanya : ఏ మాయ చేశావె సినిమాలో జంటగా నటించి నిజ జీవితంలో కూడా ఒక్కటైన జంట సమంత, నాగచైతన్య. వీరిని అభిమానులు ముద్దుగా చైసామ్ అని పిలుచుకుంటారు. ఈ టాలీవుడ్ స్టార్ కపుల్ గతేడాది విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీరి విడాకుల వార్తను సామ్ అభిమానులు, చైతూ అభిమానులు కూడా జీర్ణచుకోలేకపోయారు. కొన్నాళ్ళ పరిచయం, ఎన్నో ఏళ్ల ప్రేమ.. అనంతరం పెళ్లి చేసుకున్న ఈ జంట ఐదేళ్లకే వీరి వైవాహిక జీవితానికి శుభం కార్డు వేశారు. విడాకుల అనంతరం కూడా వీళ్ళు మళ్లీ ఒకటవుతారనే అభిమానులు భావిస్తూ వచ్చారు కానీ కొన్నాళ్ళకు అలా జరిగే అవకాశం లేదని అర్థం అయింది.
అయితే వీరి విడాకుల తర్వాత మరో అంశం తెరమీదకు వచ్చింది. నాగ చైతన్య సమంతను కాకుండా ఎవరిని పెళ్లి చేసుకునే వాడు.. అనే ప్రశ్న చాలా మంది సినీ అభిమానులలో మెదులుతోంది. నాగ చైతన్య ప్రేమ విషయం ఇంట్లో తెలియక ముందు.. వారి కుటుంబ ఎవరితో నైనా సంబంధం కలుపుకోవాలని చూసిందా అని చాలామందికి అనుమానం వస్తోంది. అయితే కొన్ని ప్రశ్నలకు వివిధ సందర్భాలలో అక్కినేని నాగర్జుననే సమాధానం ఇచ్చారు. అయితే ఇప్పుడు మరొక సమాధానం చూద్దాం. టాలీవుడ్ లో సీనియర్ ఎన్టీఆర్, ఏన్నార్ ఉన్నప్పటి నుంచే రెండు కుటుంబల మధ్య మంచి స్నేహం ఉండేది.
ఆ స్నేహం.. బాలయ్య, నాగార్జునల మధ్య కూడా కొనసాగింది. ఎవరి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా.. రెండు కుటుంబాలు తప్పక హాజరు అయ్యేవారు. అయితే వీరి స్నేహాన్ని బంధుత్వంగా మలుచుకోవడానికి బాలయ్య, నాగర్జున రెడీ అయినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. బాలయ్య చిన్న కూతురిని నాగ చైతన్యకు ఇచ్చి వివాహం చేయాలని అప్పట్లో రెండు కుటుంబాలు నిర్ణయం తీసుకున్నాయని తెలిసింది. అయితే అప్పుడు నాగ చైతన్య సమంత లవ్ మ్యాటర్ చెప్పడంతో ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గారని సమాచారం. నాగ చైతన్య సమంతను లవ్ చేయకుంటే.. ప్రస్తుతం నందమూరి బాలయ్యకు అల్లుడిగా ఉండే వాడని పలువురు అంటున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…