Naga Chaitanya : ఏ మాయ చేశావె సినిమాలో జంటగా నటించి నిజ జీవితంలో కూడా ఒక్కటైన జంట సమంత, నాగచైతన్య. వీరిని అభిమానులు ముద్దుగా చైసామ్ అని పిలుచుకుంటారు. ఈ టాలీవుడ్ స్టార్ కపుల్ గతేడాది విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీరి విడాకుల వార్తను సామ్ అభిమానులు, చైతూ అభిమానులు కూడా జీర్ణచుకోలేకపోయారు. కొన్నాళ్ళ పరిచయం, ఎన్నో ఏళ్ల ప్రేమ.. అనంతరం పెళ్లి చేసుకున్న ఈ జంట ఐదేళ్లకే వీరి వైవాహిక జీవితానికి శుభం కార్డు వేశారు. విడాకుల అనంతరం కూడా వీళ్ళు మళ్లీ ఒకటవుతారనే అభిమానులు భావిస్తూ వచ్చారు కానీ కొన్నాళ్ళకు అలా జరిగే అవకాశం లేదని అర్థం అయింది.
అయితే వీరి విడాకుల తర్వాత మరో అంశం తెరమీదకు వచ్చింది. నాగ చైతన్య సమంతను కాకుండా ఎవరిని పెళ్లి చేసుకునే వాడు.. అనే ప్రశ్న చాలా మంది సినీ అభిమానులలో మెదులుతోంది. నాగ చైతన్య ప్రేమ విషయం ఇంట్లో తెలియక ముందు.. వారి కుటుంబ ఎవరితో నైనా సంబంధం కలుపుకోవాలని చూసిందా అని చాలామందికి అనుమానం వస్తోంది. అయితే కొన్ని ప్రశ్నలకు వివిధ సందర్భాలలో అక్కినేని నాగర్జుననే సమాధానం ఇచ్చారు. అయితే ఇప్పుడు మరొక సమాధానం చూద్దాం. టాలీవుడ్ లో సీనియర్ ఎన్టీఆర్, ఏన్నార్ ఉన్నప్పటి నుంచే రెండు కుటుంబల మధ్య మంచి స్నేహం ఉండేది.
ఆ స్నేహం.. బాలయ్య, నాగార్జునల మధ్య కూడా కొనసాగింది. ఎవరి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా.. రెండు కుటుంబాలు తప్పక హాజరు అయ్యేవారు. అయితే వీరి స్నేహాన్ని బంధుత్వంగా మలుచుకోవడానికి బాలయ్య, నాగర్జున రెడీ అయినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. బాలయ్య చిన్న కూతురిని నాగ చైతన్యకు ఇచ్చి వివాహం చేయాలని అప్పట్లో రెండు కుటుంబాలు నిర్ణయం తీసుకున్నాయని తెలిసింది. అయితే అప్పుడు నాగ చైతన్య సమంత లవ్ మ్యాటర్ చెప్పడంతో ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గారని సమాచారం. నాగ చైతన్య సమంతను లవ్ చేయకుంటే.. ప్రస్తుతం నందమూరి బాలయ్యకు అల్లుడిగా ఉండే వాడని పలువురు అంటున్నారు.
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…