Bottle Gourd Juice : అధిక బరువు ఉండడం.. గుండె జబ్బులు, డయాబెటిస్, స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్లకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో బరువును నియంత్రించడం చాలా ముఖ్యం. అధిక బరువును, పొట్టను తగ్గించుకోవాలంటే ఇలా చేయడం చాలా మంచిది. ఉదయం లేవగానే లీటరంపావు నీళ్లు తాగి మలవిసర్జన చేసి మళ్లీ రెండవసారి నీళ్లు తాగి మళ్లీ మలవిసర్జన చేయాలి. 9 గంటలకు సొరకాయ జ్యూస్ తాగాలి. సొరకాయ లివర్ లోని వ్యర్థాలను బయటకు పంపేందుకు ఉపయోగపడుతుంది. ఈ సొరకాయ జ్యూస్ ని ఫిల్టర్ చేసి 300ఎంఎల్ గానీ 400ml గానీ తీసుకుని దాంట్లో తేనె లేదా నిమ్మరసం కలిపి తాగాలి.
ఆ తర్వాత 11 గంటలకి టమోటా, కీర దోసకాయ జ్యూస్ తాగాలి. దీనికి క్యారెట్, బీట్రూట్ కూడా కలిపి తాగొచ్చు. వీటిలో బీటా కెరోటిన్ ఉంటుంది. వీటన్నింటి కంటే బీటా కెరోటిన్ కరివేపాకులో ఎక్కువగా ఉంటుంది. వీటన్నింటినీ నీళ్లు కలపకుండా గ్రైండ్ చేసి ప్యూర్ జ్యూస్ తీయాలి. ఇలా తీసిన జ్యూస్ ని ఒక 300 ml తీసుకుని తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. బరువు తగ్గాలనుకునే వారు మధ్యాహ్నం ఒకటి లేదా రెండు పుల్కాలను మూడు కూరలతో కలిపి తినాలి. ప్రతిరోజు ఆకుకూర మాత్రం ఉండేలా చూసుకోవాలి. దీంతో ఈజీగా బరువు తగ్గుతారు. పొట్ట కూడా తగ్గిపోతుంది.
అలాగే సాయంత్రం పూట ఫ్రూట్ జ్యూసులు తాగాలి. ముఖ్యంగా దానిమ్మ జ్యూస్ తీసుకుంటే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కాబట్టి ఇది లివర్ కు కూడా చాలా మంచిది. మళ్లీ రాత్రి 7 గంటలకు కమల జ్యూస్ 300 ml తాగాలి. దీనిలో తేనె కలపకూడదు. అలాగే పుల్లపుల్లగా తాగాలి. ఇలా చేస్తే మద్యం మీద మనసు మళ్ళకుండా ఉంటుంది. తర్వాత ఉసిరికాయ ముక్కలను నోట్లో పెట్టుకుని చప్పరించాలి.
ఇలా రోజుకి నాలుగు జ్యూసులు తాగడం వల్ల విటమిన్ A, విటమిన్ C, జింక్ ఇలాంటివన్నీ శరీరానికి పుష్కలంగా అందుతాయి. మధ్యాహ్నం ఆహారం ద్వారా ప్రోటీన్ బీ కాంప్లెక్స్ అందుతుంది. కాబట్టి ఈ జ్యూసులు తాగడం వల్ల మందు మీద వ్యసనాల మీద ఉన్న ధ్యాసను తగ్గిస్తాయి. ఇలా 21 రోజుల పాటు చేస్తే బరువుతోపాటు పొట్ట కూడా తగ్గి నూతనోత్సాహం వస్తుంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…