Acharya Child Artist : మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. ఇందులో మెగా పవర్స్టార్ రామ్చరణ్ ఓ కీలక పాత్రలో నటించాడు. ఇక చిరంజీవి, చెర్రీలు ఒకే స్ర్కీన్లో కనిపించడంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఆచార్య సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ కాగా మణిశర్మ అందించిన పాటలు బాగానే ఆకట్టుకున్నాయి. అలాగే ఈ చిత్రంలో సోనూ సూద్ విలన్ గా నటించాడు. ఇక ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చింది. తొలిసారి కెరీర్ లో అపజయం మూట కట్టుకున్నాడు కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ.
అయితే ఈ సినిమాలో కనిపించిన ఓ ఛైల్డ్ ఆర్టిస్ అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ బాలుడి పేరు మిథున్ శ్రేయాష్. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన డాక్టర్ భీమనాథుని సదానందం కుమారుడు శ్రీధర్, సరిత దంపతుల కుమారుడే ఈ మిథున్. వీరు ప్రస్తుతం హైదరాబాద్లోని రామంతాపూర్లో ఉంటున్నారు. మిథున్ సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో 5వ తరగతి చదువుతున్నాడు. కాగా మెగాస్టర్ చిరంజీవి సినిమాలో తన మనవడు నటించడం పట్ల సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు డాక్టర్ సదానందం.
ఆచార్య మూవీలో ఛైల్డ్ ఆర్టిస్ట్ కోసం వెతుకుతున్నారని శ్రీధర్ మిత్రుడు విజయ్కుమార్ మా దృష్టికి తీసుకొచ్చారు. మాకు తెలిసిన వారి ద్వారా మా మనవడిని సినిమా వాళ్లకి పరిచయం చేశాం. ఆడిషన్లో బాగా డైలాగ్లు చెప్పడంతో సినిమాకు ఎంపిక చేశారు. రాజమండ్రి మారెడుమల్లె, కోకాపేట ప్రాంతాల్లో జరిగిన షూటింగ్లో పాల్గొన్నాడు. చిరంజీవి సినిమాలో నా మనవడు నటించడం ఎంతో సంతోషంగా ఉందని సదానందం చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమాలో భాగమైనందుకు గాను పట్టణంలోని ప్రైవేట్ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో మిథున్ని అభినందించారు. ఆచార్యలో అభినయంతో ఆకట్టుకున్న మిథున్ ముందు ముందు మరిన్ని సినిమా అవకాశాలు సొంతం చేసుకుంటాడేమో చూడాలి.
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…