Radhe Shyam : కరోనా నేపథ్యంలో అనేక సినిమాలు వాయిదా పడుతున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే సంక్రాంతికి విడుదల కావల్సిన ప్రభాస్ రాధే శ్యామ్ మూవీని వాయిదా వేశారు. సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ సినిమా ఉండడం, కరోనా ప్రభావం వల్ల జనవరి 14న విడుదల కావల్సిన మూవీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే ఈ చిత్రాన్ని ఓటీటీలోనే డైరెక్ట్గా రిలీజ్ చేస్తారంటూ గతంలో వార్తలు వచ్చాయి. దీంతో అప్పట్లో చిత్ర నిర్మాతలు ఈ విషయంపై స్పందించారు. రాధే శ్యామ్ను థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని చెప్పారు. దీంతో పుకార్లకు చెక్ పెట్టినట్లు అయింది. అయితే ఇప్పుడు మళ్లీ ఇవే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఓ బడా స్ట్రీమింగ్ సంస్థ రాధే శ్యామ్ను కొనుగోలు చేసేందుకు భారీ డీల్ను ఆఫర్ చేసిందని వార్తలు వస్తున్నాయి.
కానీ తాజాగా వస్తున్న వార్తలను చిత్ర యూనిట్ ఖండించలేదు. అయితే రాధేశ్యామ్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలను ఓటీటీలో విడుదల చేస్తే నిర్మాతలకు తీవ్రమైన నష్టం కలుగుతుంది. కనుక ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసే చాన్సే లేదని విశ్లేషకులు అంటున్నారు.
సాధారణంగా ఓటీటీ యాప్స్ రూ.120 కోట్లు అంతకన్నా తక్కువ మొత్తంలో బడ్జెట్ పెట్టిన సినిమాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఓటీటీ యాప్స్ ఒక మూవీకి గరిష్టంగా రూ.150 కోట్లను ఖర్చు చేయగలవని.. కానీ రాధే శ్యామ్ చిత్రాన్ని రూ.300 కోట్లకు పైగా బడ్జెట్తో తీశారు కనుక.. తక్కువ మొత్తానికి చిత్రాన్ని ఎవరూ అమ్ముకోరని అంటున్నారు. కనుక రాధే శ్యామ్ ఓటీటీలో విడుదల కాదని, థియేటర్లలోనే విడుదలవుతుందని అంటున్నారు. దీనిపై చిత్ర నిర్మాతలు మళ్లీ స్పష్టమైన ప్రకటన చేస్తారని తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…