Radhe Shyam : కరోనా నేపథ్యంలో అనేక సినిమాలు వాయిదా పడుతున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే సంక్రాంతికి విడుదల కావల్సిన ప్రభాస్ రాధే శ్యామ్ మూవీని వాయిదా వేశారు. సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ సినిమా ఉండడం, కరోనా ప్రభావం వల్ల జనవరి 14న విడుదల కావల్సిన మూవీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే ఈ చిత్రాన్ని ఓటీటీలోనే డైరెక్ట్గా రిలీజ్ చేస్తారంటూ గతంలో వార్తలు వచ్చాయి. దీంతో అప్పట్లో చిత్ర నిర్మాతలు ఈ విషయంపై స్పందించారు. రాధే శ్యామ్ను థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని చెప్పారు. దీంతో పుకార్లకు చెక్ పెట్టినట్లు అయింది. అయితే ఇప్పుడు మళ్లీ ఇవే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఓ బడా స్ట్రీమింగ్ సంస్థ రాధే శ్యామ్ను కొనుగోలు చేసేందుకు భారీ డీల్ను ఆఫర్ చేసిందని వార్తలు వస్తున్నాయి.
కానీ తాజాగా వస్తున్న వార్తలను చిత్ర యూనిట్ ఖండించలేదు. అయితే రాధేశ్యామ్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలను ఓటీటీలో విడుదల చేస్తే నిర్మాతలకు తీవ్రమైన నష్టం కలుగుతుంది. కనుక ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసే చాన్సే లేదని విశ్లేషకులు అంటున్నారు.
సాధారణంగా ఓటీటీ యాప్స్ రూ.120 కోట్లు అంతకన్నా తక్కువ మొత్తంలో బడ్జెట్ పెట్టిన సినిమాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఓటీటీ యాప్స్ ఒక మూవీకి గరిష్టంగా రూ.150 కోట్లను ఖర్చు చేయగలవని.. కానీ రాధే శ్యామ్ చిత్రాన్ని రూ.300 కోట్లకు పైగా బడ్జెట్తో తీశారు కనుక.. తక్కువ మొత్తానికి చిత్రాన్ని ఎవరూ అమ్ముకోరని అంటున్నారు. కనుక రాధే శ్యామ్ ఓటీటీలో విడుదల కాదని, థియేటర్లలోనే విడుదలవుతుందని అంటున్నారు. దీనిపై చిత్ర నిర్మాతలు మళ్లీ స్పష్టమైన ప్రకటన చేస్తారని తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…