Radhe Shyam : బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ రేంజ్ ఎంతో మారిపోయింది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ సరసన హీరోయిన్ పాత్రలో బుట్టబొమ్మ పూజాహెగ్డే నటిస్తోంది.
అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశానికి చిత్రబృందం ఏకంగా రూ.50 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. 15 నిమిషాల పాటు ఉండే ఈ సన్నివేశం సినిమాకి అత్యంత కీలకంగా మారనుంది. ఈ సన్నివేశం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందన్న ఉద్దేశంతో ఈ సన్నివేశానికి రూ.50 కోట్లు ఖర్చు చేసి మరీ తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సన్నివేశం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే చిత్రబృందం ఈ సన్నివేశం కోసం చేసిన ఖర్చులు తెలియజేయడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అవ్వడమే కాకుండా ఆ సన్నివేశం ఎలా ఉంటుందో అంటూ ఎంతో ఆతృత పడుతున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…