Pushpa 2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప రిలీజ్ అయి ఇప్పటికే 7 నెలలు కావస్తోంది. అయినప్పటికీ ఈ మూవీకి ఇంకా క్రేజ్ తగ్గలేదు. ఎక్కడ చూసినా ఈ మూవీ పాటలు, డైలాగ్సే వినిపిస్తున్నాయి. ఇందులోని డైలాగ్స్ కు ప్రేక్షకులే కాదు.. సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే పుష్ప క్రేజ్ ఖండాంతరాలకు పాకింది. ఇక పుష్ప 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.
పుష్ప 2 సెప్టెంబర్లో లాంచ్ అయితే విడుదల వేసవిలోనే ఉంటుందని అంటున్నారు. కనుక 2023 వేసవిలో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక మొదటి పార్ట్లో ఉన్న పాత్రధారులే ఇందులోనూ చాలా వరకు కనిపించనున్నారు. కానీ కొందరు కొత్త నటులను ఇతర పాత్రల కోసం ఎంపిక చేస్తున్నారు. మరోవైపు కథపై సుకుమార్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అయితే పుష్ప 2 గురించి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీకి గాను రూ.350 కోట్లను బడ్జెట్గా ఫిక్స్ చేశారట. అలాగే ఇందులో నటీనటలుకు ఇవ్వనున్న మొత్తం గురించి కూడా వార్తలు వస్తున్నాయి.
పుష్ప 2కు గాను సుకుమార్, అల్లు అర్జున్, ఇతర నటీనటులకు కూడా భారీగానే రెమ్యునరేషన్ను అందించనున్నారని తెలుస్తోంది. పుష్ప మొదటి పార్ట్కు గాను అల్లు అర్జున్ రూ.45 కోట్లను తీసుకున్నట్లు తెలుస్తుండగా.. రెండో పార్ట్కు రూ.100 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక దర్శకుడు సుకుమార్ మొదటి పార్ట్కు రూ.18 కోట్లను తీసుకున్నారట. దీంతో రెండో పార్ట్కు ఆయన రూ.45 కోట్ల మేర తీసుకోనున్నారని తెలుస్తోంది. అలాగే ఇతర నటీనటులు, టెక్నిషియన్లకు రూ.75 కోట్ల వరకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సినిమా బడ్జెట్ రూ.350 కోట్లకు పైగానే అవుతుందని అంటున్నారు. ఇక ప్రస్తుతం పుష్ప 2కు గాను ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా.. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…