Rakul Preet Singh : తెలుగు ప్రేక్షకులకు రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఉండేది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ద్వారా ఈమె తెలుగు తెరకు పరిచయం అయింది. తరువాత నాన్నకు ప్రేమతో, కరెంట్ తీగ, ధ్రువ వంటి సినిమాల్లో నటించి పాపులర్ అయింది. అయితే కొత్త హీరోయిన్లు వస్తుండడంతో రకుల్కు సహజంగానే అవకాశాలు తగ్గాయి. ఈ క్రమంలోనే ఇప్పుడీమె బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు తెలుగులో మహర్జాతకురాలిగా వెలిగిపోయింది. కానీ బాలీవుడ్కు వెళ్లడంతో అక్కడ ఈమెకు అంతగా అవకాశాలు రాలేదు. మరోవైపు తెలుగు తెరకు కూడా దూరమైంది. అయితే బాలీవుడ్లో ఈమె నటించిన చిత్రాలు హిట్ అయితే బాగానే ఉండేది. కానీ అవి ఫ్లాప్ అయ్యాయి. దీంతో అక్కడ అవకాశాల కోసం మళ్లీ ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అదే టాలీవుడ్లో ఉండి ఉంటే సమంత, తమన్నలా కాస్త పాపులారిటీ అయినా ఉండేది. దాంతో ఏదో ఒక మంచి మూవీలో చాన్స్ దక్కేది. కానీ ఆమె బాలీవుడ్కు వెళ్లడంతో అక్కడ ఫ్లాపై ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలా ఆమె పరిస్థితి మారిపోయింది. అక్కడ, ఇక్కడా.. అసలు అవకాశాలు లేక దిక్కులు చూస్తోంది.
ఒకప్పుడు ఈమె రూ.2 కోట్ల మేర పారితోషికం తీసుకుంది. కానీ ఇప్పుడు రోజుకు రూ.3 లక్షలు ఇచ్చినా సరే నటిస్తానని చెబుతోందట. అయినప్పటికీ ఈమెకు అవకాశాలు రావడం లేదు. ఆమె బాలీవుడ్కు వెళ్లి అనవసరంగా తప్పు చేసిందని అంటున్నారు. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ పరిస్థితి మరీ దారుణంగా.. అత్యంత దయనీయంగా మారిందని అంటున్నారు. అదే.. మరి.. బళ్లు ఓడలు అవడం.. ఓడలు బళ్లు అవడం అంటే.. జీవితంలో ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరు ఏవిధమైన పరిస్థితికి చేరుకుంటారో.. ఎవరూ చెప్పలేరు. అందుకు రకుల్ జీవితమే ఉదాహరణ అని చెప్పవచ్చు. మరి రానున్న రోజుల్లో ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…