Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య తన సినిమా కెరీర్ తొలినాళ్లలో సక్సెస్ కోసం తీవ్రంగా శ్రమించాడు. కానీ తరువాత తానేంటో నిరూపించుకున్నాడు. తొలి సినిమా జోష్ ఫ్లాప్ అయినా.. ఏం మాయ చేశావెతో హిట్ కొట్టాడు. ఆ తరువాత చైతూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్వతహాగా చైతూను అందరూ సౌమ్యుడని పిలుస్తుంటారు. అలాంటి వ్యక్తికి సమంత విడాకులు ఇచ్చిందంటే.. ఆయన ఆమె వల్ల ఎంతటి బాధను అనుభవించాడో అర్థం చేసుకోవచ్చు.. అంటూ అక్కినేని అభిమానులు సమంతను తెగ ట్రోల్ చేశారు. అయితే అది గతం. ఇప్పుడు చైతూ తన పనేంటో తాను చేసుకుంటున్నాడు.
ఇక నాగచైతన్య, రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన థాంక్ యూ మూవీ ఈనెల 22వ తేదీన రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే వీరు ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషనల్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక తాజాగా వీరు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. చైతూకు సైట్ ఉందని, అందుకనే ఆయన సినిమాల్లో కూడా అప్పుడప్పుడూ కళ్లద్దాలను ధరిస్తుంటాడని.. కానీ దీన్ని చూసి ఆయన స్టైల్ కోసం కళ్లద్దాలను ధరిస్తుంటాడని అనుకుంటారని.. ఇందులో నిజం లేదని తెలిపింది.
ఇక చైతన్య కూడా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. తాను, రాశిఖన్నా మంచి ఫ్రెండ్స్ అని.. కానీ తమ గురించి బయట అనేక పుకార్లు వస్తున్నాయని చైతూ తెలిపాడు. తాను ఏ విషయాన్ని అయినా సరే ఆమెతో పంచుకుంటానని తెలిపాడు. కాగా రాశిఖన్నాపై చైతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక థాంక్ యూ మూవీకి విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించగా.. ఈ మూవీతో చైతూ హ్యాట్రిక్ సాధిస్తాడని అక్కినేని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…