Puneeth Rajkumar : శాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణంతో యావత్ సినీ ప్రపంచమే తీవ్ర శోకంలో మునిగింది. సమాజంలో ఎంతో ఉన్నతమైన వ్యక్తిగా ఎదిగి ఎంతో మందికి ఆసరా కల్పించారు. పునీత్ రాజ్ కుమార్ సేవ అంతులేనిది. ఎంతో మంది సెలెబ్రిటీలు బెంగుళూరు వెళ్ళి ఆయనకు సంతాపం తెలిపి.. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపి వచ్చారు. ఈ క్రమంలో కోలీవుడ్ హీరో విశాల్ లేటెస్ట్ గా సంచలన నిర్ణయం తీసుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ గురించి, ఆయన విశేషమైన సేవల గురించి విశాల్ తెలిపి ఎమోషనల్ అయ్యారు.
పునీత్ రాజ్ కుమార్ లాంటి గొప్ప వ్యక్తిని తాను చూడలేదని, ఆయన లేరనే విషయాన్ని తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని, ఆయన రూపం ఇంకా నా కళ్ళల్లో మెదులుతూనే ఉందని అన్నారు. విశాల్ నటించిన ఎనిమి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా పునీత్ కు విశాలం నివాళులు అర్పించారు. విశాల్ మాట్లాడుతూ.. పునీత్ రాజ్ కుమార్ మరణం అనేది సినీ పరిశ్రమకు మాత్రమే కాదు.. సమాజానికి కూడా తీరని లోటు. మేకప్ ఉన్నా.. తీసేసినా.. ఎప్పుడూ ఒకేలా మాట్లాడుతారు.
అలాగే పునీత్ ఎంతోమందికి ఉచిత విద్యను అందిస్తున్నారు.. వృద్ధాశ్రమాల్ని నడిపిస్తున్నారు. ఇవన్నీ ఒక్క మనిషి చేశాడంటే చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు. అలాగే పునీత్ ఇప్పటివరకు చదివించిన 1800 మంది చిన్నారుల్ని తన స్నేహితుడిగా తాను చదివిస్తానని పునీత్ కు మాటిస్తున్నానని అన్నారు. ఈ మాటతో ప్రీ రిలీజ్ ఈవెంట్ షో మార్మోగిపోయింది. ఒక స్నేహితుడిగా నిజమైన నివాళిని అందించిన విశాల్ కు ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఏదో రెండు మాటలతో సరిపెట్టుకోకుండా.. పునీత్ బాధ్యతను తీసుకున్న విశాల్ నిజమైన స్నేహితుడని అనిపించుకున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…