Viral News : ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అనేక రకాల అరుదైన వ్యాధులతో బాధపడుతుంటారు. కొన్ని వ్యాధులకు చికిత్స ఉండదు. కొన్నింటికి చికిత్స చేస్తే మామూలు మనుషులు అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. కానీ ఆ చికిత్స చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ యువతి అలాంటి ఖరీదైన చికిత్స చేయించుకునేందుకు గాను అవసరం అయ్యే డబ్బు కోసం.. దాన్ని సహాయంగా ఇచ్చే దాతల కోసం ఎదురు చూస్తోంది.
యూకేలోని ఇంగ్లండ్లో ఉన్న లీడ్స్ అనే ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల ఎమిలీ వెబ్స్టర్ కు ఓ అరుదైన వ్యాధి ఉంది. ఆమె 2016లో తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. అప్పటి నుంచి ఆమె రోజుకు 30 సార్లకు పైగానే వాంతులు చేసుకుంటుంది. ఈమెకు ఉన్న వ్యాధిని వైద్య పరిభాషలో గ్యాస్ట్రోపారెసిస్ అంటారు. ఈ క్రమంలోనే ఆమెకు రోజూ అదే పనిగా వాంతులు అవుతుంటాయి.
అయితే ఈ వ్యాధి అత్యంత అరుదైనదని యూకేకు చెందిన వైద్య నిపుణులు తెలిపారు. యూకేలో 6 శాతం మందికి ఇలాంటి సమస్య వస్తోందని, దీంతో జీర్ణాశయం పాక్షికంగా పక్షవాతం బారిన పడుతుందని తెలిపారు. ఈ క్రమంలోనే తినే ఆహారం, తీసుకునే ద్రవాలు కిందకు వెళ్లక.. వాంతుల రూపంలో బయటకు వస్తాయని తెలిపారు. అయితే ఈ వ్యాధికి శస్త్ర చికిత్స చేయవచ్చు. దీంతో సమస్య నుంచి బయట పడవచ్చు.
కానీ ఎమిలీకి శస్త్ర చికిత్స చేసేందుకు 9,500 పౌండ్లు (దాదాపుగా రూ.9 లక్షలు) అవసరం. కానీ అంత మొత్తం ఆమె దగ్గర లేదు. దీంతో ఆమె సోషల్ మీడియాలో ఫండ్ రైజర్ ను ప్రారంభించింది. ఆమెకు నవంబర్ 11న శస్త్ర చికిత్స చేస్తామని వైద్యులు తెలిపారు. దీంతో ఆమె అప్పటి వరకు ఎలాగైనా సరే ఆ మొత్తాన్ని సేకరించాలని చూస్తోంది. ఈ వ్యాధి వల్ల ఆమె ఇప్పటికే చాలా వరకు బరువు తగ్గింది. ప్రస్తుతం ఆమె బరువు 31 కిలోలుగా ఉంది. అయితే శస్త్ర చికిత్స జరిగితే మళ్లీ మామూలుగా అయ్యేందుకు అవకాశాలు ఉంటాయని వైద్యులు తెలిపారు. దీంతో ఆమె సర్జరీ కోసం ఎదురు చూస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…