Priyamani : ఏమవుతుందో తెలియదు కానీ ఈ మధ్య సినీ పరిశ్రమలో సెలబ్రిటీ జంటలు విడాకులు తీసుకుని దూరమవుతున్నారు. యంగ్ కపుల్స్ నుంచి సీనియర్ హీరోలతో సహా విడాకుల వార్తలను ప్రకటిస్తూ అభిమానులను షాక్ కు గురి చేస్తున్నారు. గత ఏడాది మోస్ట్ లవ్ కపుల్ సమంత, నాగ చైతన్య, ఆ తర్వాత ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకుని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పుడు ఇదే లిస్ట్ లో అందాల తార ప్రియమణి కూడా చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగార్జున, ఎన్టీఆర్, గోపీచంద్, కళ్యాణ్ రామ్ వంటి అగ్రస్థాయి హీరోలతో ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది ప్రియమణి.
ఇక సినిమా అవకాశాలు తగ్గుతున్న సమయంలో ముస్తఫా అనే అతనిని పెళ్లి చేసుకుంది. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ముస్తఫాకు ముందుగానే వివాహమైంది. కానీ ప్రియమణి, అతను ప్రేమించి పెళ్లి చేసుకొని అత్త వారింటికి రెండో భార్యగా అడుగుపెట్టింది. ముస్తఫా మొదటి భార్య ప్రియమణిపై కేస్ పెడతానని బెదిరించినా ఎక్కడా భయపడకుండా తన పని తను చేసుకుంటూ ముందుకు వెళ్లి పోయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో చిత్రాలలో అడుగుపెట్టి మంచి మంచి ఆఫర్లను చేజిక్కించుకుంది ప్రియమణి. ప్రస్తుతం ప్రియమణి తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది.
అయితే ఇప్పుడు ప్రియమణి గురించి సోషల్ మీడియాలో ఒక విషయం హాట్ టాపిక్ గా మారింది. త్వరలో భర్తతో వివాహ బంధానికి బ్రేకప్ చెప్పేస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ జంట పెళ్లి చేసుకొని చాలా కాలం అయినా పిల్లలు లేరు. ఇప్పుడప్పుడే పిల్లలు వద్దని ప్రియమణి కూడా అనుకుంటుందట. కెరీర్ లో స్థిరపడిన తరువాత ప్లాన్ చేసుకుందాం అంటూ ఎప్పటికప్పుడు పిల్లలను కనడానికి అవాయిడ్ చేస్తున్నారట. ఈ కారణంగా వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడి విడాకులకు దారి తీశాయి అంటూ నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అయితే ఈ విషయంపై ప్రియమణి ఇప్పటివరకు స్పందించలేదు. అసలు విషయం ఏంటనేది ప్రియమణి చెప్పే జవాబుపై ఆధారపడి ఉంటుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…