Jio 5G Phone : కర్లో దునియా ముఠ్ఠీమే అంటూ టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. రిలయన్స్ జియో నుంచి మరో కొత్త ప్రొడక్ట్ లాంచ్ కాబోతోంది. తాజాగా ప్రముఖ నెట్ వర్క్ సంస్థ జియో వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే జియో ఫోన్లను మార్కెట్లోకి తీసుకు వచ్చిన సంస్థ ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇక గతేడాది జియో ఫోన్ నెక్ట్స్ను వినియోగదారులకు ముందుకు తెచ్చింది. కేవలం రూ.5 వేలకే ఈ స్మార్ట్ఫోన్ను అందించింది.
ఇక తాజాగా 5జీ ఫోన్ తీసుకురానున్నట్లు సంస్థ ప్రకటించింది. అయితే దసరా కానుకగా కానీ.. ఈ ఏడాది చివరి నాటికి కానీ జియో 5జి ఫోన్ మార్కెట్లోకి రానున్నట్లు టెక్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉంటాయో.. ధర ఎంత ఉంటుందన్న దానిపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
జియో 5జి ఫోన్లో 6.5 ఇంచెస్ హెచ్డీ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే ఉండనుందని సమాచారం. స్నాప్ డ్రాగన్ 480 5జి ప్రాసెసర్ను ఉపయోగిస్తున్నారని జియో వర్గాలు చెబుతున్నాయి. గూగుల్, జియో కలిపి అభివృద్ధి చేసిన ప్రగతి ఓఎస్తోనే ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ ఎక్స్ 51 మోడెమ్ ఉండనుంది. ఈ ఫోన్ లో బ్యాక్ కెమెరా13 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ కెమెరా ఉండనుంది. సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. జియో 5జి ఫోన్ 5 రకాల 5జి బ్యాండ్స్ను సపోర్టు చేస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఫోన్ వెనుక భాగంలో గానీ.. సైడ్లో గానీ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆల్వేస్ ఆన్ గూగుల్ అసిస్టెంట్, గూగుల్ లెన్స్, ట్రాన్స్లేట్ లాంటి గూగుల్ యాప్స్ ఉండనున్నాయి.
వీటితోపాటు మై జియో, జియో టీవీ ఉంటాయి. ఇతర జియో యాప్స్ కూడా అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్స్ ఛార్జింగ్కు సపోర్టుగా ఉండనుంది. డ్యుయల్ సిమ్, మెమొరీ కార్డు ఆప్షన్ ఉండనుందని తెలుస్తోంది. 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉంటుందని టెక్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. జియో 5జీ ఫోన్ను రూ.10 వేల నుంచి రూ.12 వేల మధ్య విక్రయించే అవకాశం ఉంది. జియో ఫోన్ నెక్ట్స్ తరహాలోనే వీటిని విక్రయించనున్నట్లు సమాచారం. కేవలం రూ.2,500 చెల్లించి 5జి ఫోన్ను సొంతం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈఎంఐ రూపంలో నగదు చెల్లించుకునే అవకాశం ఉంటుంది. జియో 5జి మొబైల్ తో మరో టెక్ విప్లవానికి నాంది పలకనుంది. ఈ మొబైల్ కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…