Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్.. మళయాళంలో ప్రేమమ్ సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే ఊహించని రేంజ్ హిట్ అయ్యింది. అలాగే తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ ఆ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది అనుపమ. ఫస్ట్ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. యూత్ లో ఆమె క్రేజ్ ఏ రేంజ్ ఉండేది అంటే.. ఆంధ్రలో వరదలు.. అనుపమ నా మరదలు.. అనే మీమ్స్ అప్పట్లో బాగా ట్రెండ్ అయ్యాయి. ట్విట్టర్ లో తక్కువ సమయంలోనే ఎక్కువమంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్న వాళ్ళల్లో అనుపమ ఒకరు.
గత కొంతకాలంగా సరైన హిట్లు లేని అనుకి లేటెస్ట్గా తెలుగులో కార్తికేయ 2తో సరైన టైంలో సూపర్ హిట్ పడింది. ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అనుపమ, నిఖిల్ జోడీగా నటించారు. కార్తికేయ 2 సక్సెస్ ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్న అనుపమ మాట్లాడుతూ.. చందూ గారు ఈ చిత్రకథ చెప్పినప్పుడు చాలా ఎగ్జయిట్ అయ్యాను. కార్తికేయ 2లో కృష్ణ తత్త్వం కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అందుకే ఈ మూవీ కోసం కొన్ని ప్రాజెక్ట్స్ను వదులుకున్నాను. కొన్నిచోట్ల హీరోను డామినేట్ చేసేలా నా పాత్ర ఉంది అనడంలో నిజం లేదు. కథకు తగ్గట్టుగానే నా పాత్ర ఉంది. అలాగే రౌడీ బాయ్స్లో కథ డిమాండ్ మేరకే ముద్దు సీన్స్లో నటించాను అని తెలిపింది అనుపమ.
బ్లాక్ బస్టర్ డీజే టిల్లు సీక్వెల్గా ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా అనుపమ నటించనుందని వార్తలొస్తున్నాయి. నేహా శెట్టి ప్లేస్లో అనుపమను తీసుకోనున్నారని టాక్. ఇప్పటికే అనుపమ మూవీ కోసం అగ్రిమెంట్ పై సైన్ చేసినట్లు తెలుస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేస్తోన్న ఈ డీజే టిల్లు సీక్వెల్ను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇది డీజే టిల్లుని మించి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుందో లేదో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…