Priya Prakash Varrier : సినీ నటులు అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో వారికి కూడా చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. అందరి ముందు అవమానం చెందాల్సి వస్తుంటుంది. తాజాగా హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్కు కూడా పెద్ద అవమానమే జరిగింది. ఆమెకు ఓ హోటల్లో చేదు అనుభవం ఎదురైంది. ఇంతకీ అసలు ఏం జరిగిందనే విషయానికి వస్తే..
ప్రియా ప్రకాష్ వారియర్ ముంబైకి షూటింగ్ నిమిత్తం వెళ్లింది. అక్కడ ఆమెకు ఫెర్న్ గోరెగావ్ హోటల్లో రూమ్స్ బుక్ చేశారు. అయితే ఆ హోటల్లోకి బయటి ఫుడ్ను అనుమతించరు. అక్కడే ఏదైనా కొనుగోలు చేసి తినాల్సి ఉంటుంది.
ఈ విషయం తెలియని ప్రియా.. తాను షూటింగ్ నుంచి హోటల్ రూమ్కు వస్తూ.. మధ్యలో ఫుడ్ కొనుగోలు చేసింది. దాన్ని హోటల్ రూమ్లో తినొచ్చని ఆమె భావించింది. కానీ హోటల్ పాలసీ ప్రకారం బయటి ఫుడ్ను అనుమతించరు కనుక.. వారు ఆమెను ఆ ఫుడ్ను తీసుకెళ్లనివ్వలేదు. ఫుడ్ పడేస్తే బయట పడేయండి.. లేదంటే బయటే ఉండి తినండి.. కానీ లోపలికి మాత్రం ఫుడ్ను అనుమతించబోము.. అంటూ ఆ హోటల్ వారు ఆమెకు ఖరాఖండిగా చెప్పేశారు. దీంతో ప్రియా చేసేది లేక బయట చలిలోనే నిలబడి ఫుడ్ను తిన్నది.
ఇక ఈ విషయాన్ని ఆమె సోషల్ ఖాతా ద్వారా తెలియజేసింది. తాను ఫుడ్ను ముందుగానే ఆర్డర్ చేసుకున్నానని, ఆ హోటల్లోకి బయటి ఫుడ్ అనుమతి లేదనే విషయం తనకు తెలియదని, అయితే కొన్న ఫుడ్ ను వృథాగా పడేయడం ఇష్టం లేకే హోటల్ బయట చలిలో అలాగే నిలబడి ఫుడ్ తిన్నానని చెప్పుకొచ్చింది. ఈ ఒక్కసారికి వదిలేయమని తాను రిక్వెస్ట్ చేసినా ఆ హోటల్ వారు పట్టించుకోలేదని, పెద్ద సీన్ క్రియేట్ చేశారని.. ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా ఆమె తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని, అవమానాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.
కాగా ప్రియా ప్రకాష్ వారియర్ ఇటీవలే నితిన్తో కలిసి చెక్ అనే సినిమాలో నటించింది. కానీ ఈ మూవీ ఈమెకు పెద్దగా పేరు తెచ్చి పెట్టలేదు. దీంతో ఇప్పటికీ ఈమె మంచి హిట్ కోసం వేచి చూస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…