Priya Prakash Varrier : సినీ నటులు అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో వారికి కూడా చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. అందరి ముందు అవమానం చెందాల్సి వస్తుంటుంది. తాజాగా హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్కు కూడా పెద్ద అవమానమే జరిగింది. ఆమెకు ఓ హోటల్లో చేదు అనుభవం ఎదురైంది. ఇంతకీ అసలు ఏం జరిగిందనే విషయానికి వస్తే..
ప్రియా ప్రకాష్ వారియర్ ముంబైకి షూటింగ్ నిమిత్తం వెళ్లింది. అక్కడ ఆమెకు ఫెర్న్ గోరెగావ్ హోటల్లో రూమ్స్ బుక్ చేశారు. అయితే ఆ హోటల్లోకి బయటి ఫుడ్ను అనుమతించరు. అక్కడే ఏదైనా కొనుగోలు చేసి తినాల్సి ఉంటుంది.
ఈ విషయం తెలియని ప్రియా.. తాను షూటింగ్ నుంచి హోటల్ రూమ్కు వస్తూ.. మధ్యలో ఫుడ్ కొనుగోలు చేసింది. దాన్ని హోటల్ రూమ్లో తినొచ్చని ఆమె భావించింది. కానీ హోటల్ పాలసీ ప్రకారం బయటి ఫుడ్ను అనుమతించరు కనుక.. వారు ఆమెను ఆ ఫుడ్ను తీసుకెళ్లనివ్వలేదు. ఫుడ్ పడేస్తే బయట పడేయండి.. లేదంటే బయటే ఉండి తినండి.. కానీ లోపలికి మాత్రం ఫుడ్ను అనుమతించబోము.. అంటూ ఆ హోటల్ వారు ఆమెకు ఖరాఖండిగా చెప్పేశారు. దీంతో ప్రియా చేసేది లేక బయట చలిలోనే నిలబడి ఫుడ్ను తిన్నది.
ఇక ఈ విషయాన్ని ఆమె సోషల్ ఖాతా ద్వారా తెలియజేసింది. తాను ఫుడ్ను ముందుగానే ఆర్డర్ చేసుకున్నానని, ఆ హోటల్లోకి బయటి ఫుడ్ అనుమతి లేదనే విషయం తనకు తెలియదని, అయితే కొన్న ఫుడ్ ను వృథాగా పడేయడం ఇష్టం లేకే హోటల్ బయట చలిలో అలాగే నిలబడి ఫుడ్ తిన్నానని చెప్పుకొచ్చింది. ఈ ఒక్కసారికి వదిలేయమని తాను రిక్వెస్ట్ చేసినా ఆ హోటల్ వారు పట్టించుకోలేదని, పెద్ద సీన్ క్రియేట్ చేశారని.. ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా ఆమె తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని, అవమానాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.
కాగా ప్రియా ప్రకాష్ వారియర్ ఇటీవలే నితిన్తో కలిసి చెక్ అనే సినిమాలో నటించింది. కానీ ఈ మూవీ ఈమెకు పెద్దగా పేరు తెచ్చి పెట్టలేదు. దీంతో ఇప్పటికీ ఈమె మంచి హిట్ కోసం వేచి చూస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…