Chiranjeevi : కరోనా.. అది ఎవరినీ వదలడం లేదు. సామాన్యులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు.. అని తేడా లేకుండా అందరికీ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలకు కరోనా సోకింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. మహేష్ బాబు, మంచు లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, సత్యరాజ్, విశ్వక్ సేన్, త్రిష తదితర నటీనటులు ఈ మధ్యకాలంలో కరోనా బారిన పడ్డారు. తాజాగా చిరంజీవి కోవిడ్కు గురవడం అభిమానుల్లో ఆందోళనను కలిగిస్తోంది.
తాను కరోనా బారిన పడ్డాననే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తాను అన్ని జాగ్రత్తలను తీసుకున్నానని, అయినప్పటికీ కరోనా బారిన పడ్డానని చిరంజీవి తెలిపారు. తనకు స్వల్ప కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు వివరించారు. తనను కలిసిన వారందరూ కోవిడ్ నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. త్వరగా కోలుకుని మళ్లీ అభిమానుల ముందుకు వస్తానన్నారు. ప్రజలు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కాగా చిరంజీవి ప్రస్తుతం పలు వరుస సినిమాలను చేస్తున్నారు. ఓ వైపు ఆచార్య మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతుండగా.. మరోవైపు గాడ్ ఫాదర్, బోళా శంకర్ సినిమాల షూటింగ్లో మెగాస్టార్ పాల్గొంటున్నారు. ఈ మధ్యే ఆయన ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. త్వరలోనే ఇండస్ట్రీకి అనుకూలంగా ఓ నిర్ణయం వస్తుందని తెలిపారు.
కాగా భోళా శంకర్ చిత్ర షూటింగ్లో చిరంజీవి కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. దీంతో చిత్ర యూనిట్ అప్రమత్తమైంది. ఈ మూవీలో చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తున్న కీర్తి సురేష్ కూడా ఇటీవలే కరోనా బారిన పడింది. అయితే కీర్తి సురేష్ నటించిన మరో మూవీ గుడ్ లక్ సఖి చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఈ నెల 26న హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కావల్సి ఉంది.
కానీ చిరంజీవి కరోనా బారిన పడడంతో ఆయన లేకుండానే ఆ ఈవెంట్ను నిర్వహిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రం జనవరి 28వ తేదీన విడుదల కానుంది. ఇక తాజాగా పద్మ అవార్డులను అందుకున్న అందరికీ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆయన కరోనా బారిన పడడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని వారు ప్రార్థిస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…