Chiranjeevi : చేదు వార్త చెప్పిన చిరంజీవి.. అభిమానుల్లో ఆందోళ‌న‌..!

Chiranjeevi : క‌రోనా.. అది ఎవ‌రినీ వ‌ద‌ల‌డం లేదు. సామాన్యులు, సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు.. అని తేడా లేకుండా అంద‌రికీ వ్యాప్తి చెందుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు టాలీవుడ్ సెల‌బ్రిటీల‌కు క‌రోనా సోకింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు. మ‌హేష్ బాబు, మంచు ల‌క్ష్మి, రాజేంద్ర ప్ర‌సాద్‌, స‌త్య‌రాజ్‌, విశ్వ‌క్ సేన్‌, త్రిష త‌దిత‌ర న‌టీన‌టులు ఈ మ‌ధ్య‌కాలంలో క‌రోనా బారిన ప‌డ్డారు. తాజాగా చిరంజీవి కోవిడ్‌కు గుర‌వ‌డం అభిమానుల్లో ఆందోళ‌న‌ను క‌లిగిస్తోంది.

తాను క‌రోనా బారిన ప‌డ్డాన‌నే విష‌యాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. తాను అన్ని జాగ్ర‌త్త‌ల‌ను తీసుకున్నాన‌ని, అయిన‌ప్ప‌టికీ క‌రోనా బారిన ప‌డ్డాన‌ని చిరంజీవి తెలిపారు. త‌న‌కు స్వ‌ల్ప కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు వివ‌రించారు. త‌న‌ను క‌లిసిన వారంద‌రూ కోవిడ్ నిర్దార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరారు. త్వ‌ర‌గా కోలుకుని మ‌ళ్లీ అభిమానుల ముందుకు వ‌స్తాన‌న్నారు. ప్ర‌జ‌లు క‌రోనా ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు.

కాగా చిరంజీవి ప్ర‌స్తుతం ప‌లు వ‌రుస సినిమాల‌ను చేస్తున్నారు. ఓ వైపు ఆచార్య మూవీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా కొన‌సాగుతుండ‌గా.. మ‌రోవైపు గాడ్ ఫాద‌ర్‌, బోళా శంకర్ సినిమాల షూటింగ్‌లో మెగాస్టార్ పాల్గొంటున్నారు. ఈ మ‌ధ్యే ఆయ‌న ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల విష‌యంలో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌లిశారు. త్వ‌ర‌లోనే ఇండ‌స్ట్రీకి అనుకూలంగా ఓ నిర్ణ‌యం వ‌స్తుంద‌ని తెలిపారు.

కాగా భోళా శంక‌ర్ చిత్ర షూటింగ్‌లో చిరంజీవి క‌రోనా బారిన ప‌డిన‌ట్లు తెలుస్తోంది. దీంతో చిత్ర యూనిట్ అప్ర‌మ‌త్త‌మైంది. ఈ మూవీలో చిరంజీవి చెల్లెలి పాత్ర‌లో న‌టిస్తున్న కీర్తి సురేష్ కూడా ఇటీవ‌లే క‌రోనా బారిన ప‌డింది. అయితే కీర్తి సురేష్ న‌టించిన మ‌రో మూవీ గుడ్ ల‌క్ స‌ఖి చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 26న హైద‌రాబాద్‌లోని పార్క్ హ‌య‌త్ హోట‌ల్‌లో నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌రు కావ‌ల్సి ఉంది.

కానీ చిరంజీవి క‌రోనా బారిన ప‌డ‌డంతో ఆయ‌న లేకుండానే ఆ ఈవెంట్‌ను నిర్వ‌హిస్తార‌ని తెలుస్తోంది. ఈ చిత్రం జ‌న‌వ‌రి 28వ తేదీన విడుద‌ల కానుంది. ఇక తాజాగా ప‌ద్మ అవార్డుల‌ను అందుకున్న అంద‌రికీ చిరంజీవి శుభాకాంక్ష‌లు తెలిపారు. అయితే ఆయ‌న క‌రోనా బారిన ప‌డ‌డం అభిమానులను ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని వారు ప్రార్థిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రాజా సాబ్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా.. చిత్ర యూనిట్‌కు ప్రభాస్ గిఫ్టులు! ‘డార్లింగ్’ అంటే అంతే మరి..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…

Saturday, 24 January 2026, 9:49 PM

బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. టీ20 వరల్డ్ కప్ నుంచి అవుట్! స్కాట్లాండ్‌కు బంపర్ ఆఫర్..

భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…

Saturday, 24 January 2026, 5:25 PM

BSSC ఇంటర్ లెవల్ నోటిఫికేషన్ 2026: అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు!

బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…

Saturday, 24 January 2026, 10:15 AM

రాయ్‌పూర్ టీ20: కివీస్‌పై భారత్ ఘనవిజయం.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం!

రాయ్‌పూర్ వేదికగా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని…

Friday, 23 January 2026, 10:53 PM

పప్పులను వండే ముందు నానబెడుతున్నారా? లేదంటే డేంజరే.. న్యూట్రిషనిస్ట్ చెబుతున్న షాకింగ్ నిజాలు!

భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…

Friday, 23 January 2026, 8:02 PM

విశ్లేషణ: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వయంకృతాపరాధం.. పాక్ మాటలు నమ్మి వరల్డ్ కప్‌కు దూరం?

ఎదుటి వ్య‌క్తి క‌ష్టాల్లో ఉంటే అత‌ని ప‌రిస్థితిని కొంద‌రు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆస‌రాగా చేసుకుని త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాలు…

Friday, 23 January 2026, 3:54 PM

మీ పాన్ కార్డు పోయిందా? స్మార్ట్‌ఫోన్‌లోనే ‘ఇ-పాన్’ డౌన్‌లోడ్ చేసుకోండి.. పూర్తి ప్రాసెస్ ఇదే!

ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…

Friday, 23 January 2026, 9:51 AM

అల్లు అర్జున్ పోస్ట్‌పై నయనతార ఇంట్రెస్టింగ్ రియాక్షన్.. మెగాస్టార్ సినిమాపై ‘పుష్ప’రాజ్ పోస్ట్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…

Thursday, 22 January 2026, 4:46 PM