Posani : పచ్చి బూతులు తిట్టడంతో బయటకు రాలేదు.. పోసాని వాచ్ మెన్ భార్య సంచలన వ్యాఖ్యలు..

సెప్టెంబర్ 30, 2021 4:13 సా.

Posani : గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో పోసాని వర్సెస్ పవన్ కళ్యాణ్ యుద్ధం నడుస్తోంది. పోసాని చేసిన వ్యాఖ్యలపై పవన్ అభిమానులు ఆయనిని టార్గెట్ చేస్తూ ఎన్నో చిత్రహింసలకు గురి చేస్తున్నారని పోసాని వెల్లడిస్తున్నారు. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ చేసిన వ్యాఖ్యలకు దీటుగా స్పందించిన పోసానిపై పవన్ అభిమానులు దాడికి ప్రయత్నించారని పోసాని ఆరోపణలు చేశారు.

Posani : పచ్చి బూతులు తిట్టడంతో బయటకు రాలేదు.. పోసాని వాచ్ మెన్ భార్య సంచలన వ్యాఖ్యలు..
Posani

ఈ క్రమంలోనే పవన్ అభిమానులు పోసాని ఇంటిపై రాళ్లతో దాడికి దిగారని పోసాని వాచ్ మెన్ భార్య శోభ వెల్లడించింది. గత రాత్రి ఇద్దరు వ్యక్తులు ఇంటిపై రాళ్లతో దాడికి దిగారని, వారిరువురు మాట్లాడుకున్న మాటలు వినిపించాయని ఈ సందర్భంగా శోభ మీడియాకు వెల్లడించింది. అయితే గత ఎనిమిది నెలల నుంచి పోసాని దంపతులు ఈ ఇంటిలో లేరని, వారు లేనప్పటికీ ఈ ఇంటి దగ్గర తామే ఉంటూ రాత్రి సమయంలో అక్కడే నిద్రిస్తున్నామని వాచ్ మెన్ భార్య తెలియజేసింది.

అయితే గత రెండు మూడు రోజుల నుంచి పోసానిని బూతులు తిడుతూ, ఇంటిపై రాళ్ల దాడి చేయడంతో భయంతో తాము ఇంటి నుంచి బయటకు రాలేదని ఈ సందర్భంగా శోభ మీడియాకు వెల్లడించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment