Vaishnav Tej : క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ తన రెండవ సినిమాగా తెరకెక్కిన చిత్రం “కొండపొలం”. ఇందులో వైష్ణవ్ ఒక గ్రామీణ యువకుడి పాత్రలో గొర్రెల కాపరిగా కనిపించనున్నాడు. మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వైష్ణవ్ రెండవ సినిమాను కూడా అదే స్థాయిలో తెరకెక్కించాలని క్రిష్ భావించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని ఈనెల 8వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇక ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేయగా విపరీతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో రకుల్, వైష్ణవ్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా వైష్ణవ్ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముందుగా ఇంత అద్భుతమైన సినిమాలో నటించే అవకాశం కల్పించినందుకు డైరెక్టర్ క్రిష్ కి స్పెషల్ థాంక్స్ చెప్పారు.
ఈ సినిమా గురించి వైష్ణవ్ మాట్లాడుతూ ఈ సినిమా కథ విన్న సమయంలో ఎంతో ఎక్సైట్ మెంట్ గా అనిపించింది. అయితే ఈ సినిమా కథపై ఒకసారి తన మామయ్య పవన్ కళ్యాణ్ జడ్జ్ మెంట్ కూడా తీసుకుంటానని చెప్పినప్పుడు కథవిన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటించాలని తనని ప్రోత్సహించినట్లు.. ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్ తెలియజేశారు. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. మరి ఈ సినిమా ద్వారా వైష్ణవ్ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటారో వేచి చూడాలి.
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్ను ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…