Pawan Kalyan : ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. గత కొద్ది రోజులుగా ఆయన భీమ్లా నాయక్ అనే చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో పవన్కు జోడిగా నిత్య మీనన్ నటిస్తుండగా, రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ప్లే అందిస్తోన్న విషయం తెలిసిందే. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి బరిలో ఈ మూవీ విడుదల కానున్నట్టు తెలుస్తుంది.
భీమ్లా నాయక్ చిత్రం ఒక వైపు షూటింగ్ జరుపుకుంటూనే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటోంది. తాజాగా ఎడిటెడ్ ఫుటేజ్ని ప్రత్యేకంగా పరిశీలించారు పవర్స్టార్ పవన్కల్యాణ్. డీఓపీ రవి.కె.చంద్రన్ పనితీరును మెచ్చుకుంటూ చేతిరాతతో అప్రిషియేషన్ లెటర్ రాసిచ్చారు. భీమ్లానాయక్ ప్రాజెక్ట్లో మీరు ఒక పార్ట్ కావడం సంతోషదాయకం… ఔట్పుట్లో మంచి డిఫరెన్స్ చూపించారు.. థ్యాంక్స్ అంటూ లెటర్ రాసి ఆయనకు ప్రత్యేకంగా బొకే కూడా అందించారు.
పవన్ కళ్యాణ్ స్వదస్తూరితో రాసి ఇచ్చిన లేఖను చూసి మురిసిపోయిన రవి కె చంద్రన్.. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తన కెమెరాతో ఎంతోమందిని స్టార్లను అందంగా చూపించి, ఎన్నో అద్భుత దృశ్యాల్ని వెండితెరపై ఆవిష్కరించి భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సినిమాటోగ్రాఫర్ రవి కె.చంద్రన్.. అంతర్జాతీయ స్థాయిలో ‘తమర’ అనే క్రేజీ ప్రాజెక్టును తెరకెక్కించనున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…