Pawan Kalyan BJP : బద్వేల్ ఉప ఉన్నికకు నోటిఫికేషన్ విడుదల అవడం ఏమోగానీ.. ఈ ఉప ఎన్నికతో బీజేపీ పవన్ను ఇరుకున పెడుతున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు అక్కడ పోటీ చేసేది లేదని, ఏకగ్రీం అయితే బాగుంటుందని.. పవన్ చెప్పేశారు. అయితే గతంలో టీడీపీతో ఉన్న అనుబంధమో, మరో విషయమో తెలియదు కానీ.. పవన్ చెప్పినట్లుగా.. టీడీపీ కూడా అక్కడ పోటీ చేయడం లేదని చెప్పింది. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
అయితే పవన్, బీజేపీ మిత్రులు కనుక.. ఒకరి నిర్ణయాన్ని మరొకరు స్వాగతించాల్సి ఉంటుంది. కానీ పవన్ నిర్ణయానికి మాత్రం బీజేపీ వ్యతిరేకంగా వెళ్తోంది. పవన్ వద్దు అంటుంటే.. బీజేపీ మాత్రం పోటీ చేయాల్సిందేనని పట్టుబట్టింది. మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక అడుగు ముందుకు వేసి బద్వేల్లో పోటీ చేస్తామని, విడిచిపెట్టే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టేశారు. అలాగే తమ ప్రచారానికి పవన్ కూడా వస్తారని స్పష్టం చేశారు. దీంతో బీజేపీ పవన్ను ఇరుకున పెట్టినట్లు అయింది.
అయితే బద్వేల్లో పోటీ చేయొద్దన్న పవన్ తన నిర్ణయాన్ని తానే వ్యతిరేకించి బీజేపీతో ఎన్నికల్లో ప్రచారం చేస్తారా ? లేదా ? అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. రాజకీయాల్లో ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటేనే ప్రజల నుంచి ఆమోదం లభిస్తుంది. అలా కాకుండా తన నిర్ణయానికి తానే వ్యతిరేకంగా వెళితే.. ప్రజామోదం లభించదు. ఈ క్రమంలో పవన్ వద్దంటుండడం, బీజేపీ పోటీ చేస్తామని అంటుండడం.. చర్చనీయాంశంగా మారాయి.
బద్వేల్ లో పోటీ చేయాలన్న బీజేపీ నిర్ణయాన్ని సమర్థించి పవన్ తన నిర్ణయాన్ని తానే వ్యతిరేకించి ముందుకు సాగుతారా ? లేక తన నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటారా ? అని.. రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. అయితే పవన్ తీసుకునే నిర్ణయంపైనే ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చర్చించుకుంటున్నారు. ఎందుకంటే బీజేపీ చెప్పినట్లు చేయకపోతే జనసేనకు భవిష్యత్తులో మద్దతు ఇచ్చే అవకాశాలు సన్నగిల్లుతాయి. మరి పవన్ ఈ విషయంలో ఏం చేస్తారో చూడాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…