Rohini : బిగ్ బాస్ షో ఎందరో జీవితాలని మార్చేసింది. ఈ షోకి ముందు సాదా సీదా నటీనటులుగా ఉండే వాళ్లు బిగ్ బాస్ తర్వాత స్టార్ సెలబ్రిటీ స్టేటస్ పొందారు. వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో లగ్జరీ కార్లు, పెద్ద బంగ్లాలు కొంటున్నారు. తాజాగా బిగ్ బాస్ ఫేం, బుల్లితెర నటి రోహిణి హైదరాబాద్లోని మణికొండలో డూప్లెక్స్ హౌస్ను కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఆమె అభిమానులతో పంచుకుంటూ తెగ ఎగ్జైట్ అయింది.
కొంచెం కష్టం సీరియల్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న రోహిణి.. ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని మరింత పాపులర్ అయింది. ఇప్పుడు ఈమె బుల్లితెర రాములమ్మగా అందరి చేత పిలిపించుకుంటోంది. ఆ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీలో రోహిణి ఓ స్కిట్ చేయగా, అచ్చం విజయశాంతిలానే నటించి మెప్పించింది.. గ్యాంగ్ లీడర్, మొండి మొగుడు పెంకి పెళ్ళాం, ఒసేయ్ రాములమ్మ, ప్రతిఘటన, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలలో విజయశాంతి చేసిన కొన్ని సన్నివేశాలు, పాటలను తీసుకొని ఆ పాత్రలకు తగ్గట్టుగా వస్త్ర ధారణ చేసి బాగా పర్ఫామెన్స్ చేసింది.
తాజాగా సొంతింటి కలను నిజం చేసుకున్న రోహిణి.. ఇంట్లోకి తన తల్లిని తీసుకెళ్లి చూపించింది. ప్రేక్షకుల కోసం హోమ్ టూర్ వీడియోను యూట్యూబ్లో షేర్ చేసింది. హాల్, కిచెన్, బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్, సిట్టింగ్ ఏరియా, టెర్రస్ను అంతా చూపిస్తూ సందడి చేసింది. త్వరలోనే ఈ ఇంటిని తనకు నచ్చినట్లు మరింత అందంగా మార్చేస్తానని పేర్కొంది రోహిణి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…