Paruchuri Gopala Krishna : మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ నటించిన ఆచార్య చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుందో అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సినిమా కెరీర్లోనే అత్యంత దారుణమైన డిజాస్టర్గా ఈ మూవీ నిలిచింది. ఈ సినిమా వల్ల మేకర్స్కు ఏకంగా రూ.84 కోట్ల నష్టం వచ్చింది. దీంతో చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ ఆ నష్టాన్ని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆచార్య సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అనే విషయంపై ఇప్పటి వరకు అనేక మంది అనేక కారణాలు చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇదే విషయంపై స్పందించారు. ఆయన ఆచార్య ఫ్లాప్పై పలు కామెంట్స్ చేశారు.
ప్రస్తుత తరుణంలో నక్సలిజం, కమ్యూనిజం, అభ్యుదయ భావాలు.. వంటి మెసేజ్లతో కూడిన సినిమాలు ప్రేక్షకులకు ఎక్కడం లేదని.. ఏమైనా వారు వినోదాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. అలాంటప్పుడు కొరటాల ఎంచుకున్న కథనే తప్పని అన్నారు. ఆచార్య టైటిల్ అసలు సెట్ కాలేదని అన్నారు. చిరంజీవి, చరణ్ ఇందులో బాగానే యాక్ట్ చేసినప్పటికీ కథ చాలా బలహీనంగా ఉందని.. అలాంటప్పుడు హీరో ఎవరు ఉన్నా సినిమా ఆడదని అన్నారు. ఇక అసలు ఈ మూవీలో చరణ్ లేకుండా ఉంటే బాగుండేదని అన్నారు.
సస్పెన్స్, సెంటిమెంట్ ఒకే ఒరలో ఇమడలేవని పరుచూరి గోపాల కృష్ణ అన్నారు. ఈ విషయాన్ని కొరటాల గుర్తు పెట్టుకుంటే మంచిదని ఆయనకు క్లాస్ పీకారు. ఇక చరణ్ పాత్రను సెకండాఫ్ వరకు సీక్రెట్గా ఉంచారని.. అలాగే ముగింపు కూడా సరిగ్గా లేదని.. ఫస్టాఫ్లోనే చరణ్ను చూపించి ఉంటే బాగుండేదని అన్నారు. ఇలా ఆచార్య మూవీలో ఉన్న తప్పుల గురించి పరుచూరి గోపాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు ఎవరెన్ని అన్నా.. సినిమా మాత్రం దారుణ డిజాస్టర్ టాక్ను తెచ్చుకుంది కనుక ఇప్పుడు ఎవరూ ఏమీ చేయలేరు. ఇకపైనైనా ఇలాంటి కథలతో ప్రయోగాలు చేయకుండా ఉంటే మంచిదని.. చిరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…