Paruchuri Gopala Krishna : మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ నటించిన ఆచార్య చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుందో అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సినిమా కెరీర్లోనే అత్యంత దారుణమైన డిజాస్టర్గా ఈ మూవీ నిలిచింది. ఈ సినిమా వల్ల మేకర్స్కు ఏకంగా రూ.84 కోట్ల నష్టం వచ్చింది. దీంతో చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ ఆ నష్టాన్ని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆచార్య సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అనే విషయంపై ఇప్పటి వరకు అనేక మంది అనేక కారణాలు చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇదే విషయంపై స్పందించారు. ఆయన ఆచార్య ఫ్లాప్పై పలు కామెంట్స్ చేశారు.
ప్రస్తుత తరుణంలో నక్సలిజం, కమ్యూనిజం, అభ్యుదయ భావాలు.. వంటి మెసేజ్లతో కూడిన సినిమాలు ప్రేక్షకులకు ఎక్కడం లేదని.. ఏమైనా వారు వినోదాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. అలాంటప్పుడు కొరటాల ఎంచుకున్న కథనే తప్పని అన్నారు. ఆచార్య టైటిల్ అసలు సెట్ కాలేదని అన్నారు. చిరంజీవి, చరణ్ ఇందులో బాగానే యాక్ట్ చేసినప్పటికీ కథ చాలా బలహీనంగా ఉందని.. అలాంటప్పుడు హీరో ఎవరు ఉన్నా సినిమా ఆడదని అన్నారు. ఇక అసలు ఈ మూవీలో చరణ్ లేకుండా ఉంటే బాగుండేదని అన్నారు.
సస్పెన్స్, సెంటిమెంట్ ఒకే ఒరలో ఇమడలేవని పరుచూరి గోపాల కృష్ణ అన్నారు. ఈ విషయాన్ని కొరటాల గుర్తు పెట్టుకుంటే మంచిదని ఆయనకు క్లాస్ పీకారు. ఇక చరణ్ పాత్రను సెకండాఫ్ వరకు సీక్రెట్గా ఉంచారని.. అలాగే ముగింపు కూడా సరిగ్గా లేదని.. ఫస్టాఫ్లోనే చరణ్ను చూపించి ఉంటే బాగుండేదని అన్నారు. ఇలా ఆచార్య మూవీలో ఉన్న తప్పుల గురించి పరుచూరి గోపాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు ఎవరెన్ని అన్నా.. సినిమా మాత్రం దారుణ డిజాస్టర్ టాక్ను తెచ్చుకుంది కనుక ఇప్పుడు ఎవరూ ఏమీ చేయలేరు. ఇకపైనైనా ఇలాంటి కథలతో ప్రయోగాలు చేయకుండా ఉంటే మంచిదని.. చిరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…