Paruchuri Gopala Krishna : కొర‌టాల శివ‌కు క్లాస్ పీకిన ప‌రుచూరి గోపాల కృష్ణ‌.. ఆచార్య‌లో చేసిన త‌ప్పుల‌ను చెప్పేశారు..

July 3, 2022 6:55 PM

Paruchuri Gopala Krishna : మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ న‌టించిన ఆచార్య చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఎంత‌టి ఘోర ప‌రాభ‌వాన్ని మూట‌గ‌ట్టుకుందో అంద‌రికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సినిమా కెరీర్‌లోనే అత్యంత దారుణ‌మైన డిజాస్ట‌ర్‌గా ఈ మూవీ నిలిచింది. ఈ సినిమా వ‌ల్ల మేక‌ర్స్‌కు ఏకంగా రూ.84 కోట్ల న‌ష్టం వ‌చ్చింది. దీంతో చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌, కొర‌టాల శివ ఆ న‌ష్టాన్ని భ‌ర్తీ చేస్తామ‌ని హామీ ఇచ్చారు. అయితే ఆచార్య సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అనే విష‌యంపై ఇప్ప‌టి వ‌ర‌కు అనేక మంది అనేక కార‌ణాలు చెప్పారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ప్ర‌ముఖ ర‌చ‌యిత ప‌రుచూరి గోపాల‌కృష్ణ ఇదే విష‌యంపై స్పందించారు. ఆయన ఆచార్య ఫ్లాప్‌పై ప‌లు కామెంట్స్ చేశారు.

ప్రస్తుత త‌రుణంలో న‌క్స‌లిజం, క‌మ్యూనిజం, అభ్యుద‌య భావాలు.. వంటి మెసేజ్‌ల‌తో కూడిన సినిమాలు ప్రేక్ష‌కుల‌కు ఎక్క‌డం లేద‌ని.. ఏమైనా వారు వినోదాన్ని కోరుకుంటున్నార‌ని తెలిపారు. అలాంట‌ప్పుడు కొర‌టాల ఎంచుకున్న క‌థ‌నే త‌ప్ప‌ని అన్నారు. ఆచార్య టైటిల్ అస‌లు సెట్ కాలేద‌ని అన్నారు. చిరంజీవి, చ‌ర‌ణ్ ఇందులో బాగానే యాక్ట్ చేసిన‌ప్ప‌టికీ క‌థ చాలా బ‌ల‌హీనంగా ఉంద‌ని.. అలాంట‌ప్పుడు హీరో ఎవ‌రు ఉన్నా సినిమా ఆడ‌ద‌ని అన్నారు. ఇక అస‌లు ఈ మూవీలో చ‌ర‌ణ్ లేకుండా ఉంటే బాగుండేద‌ని అన్నారు.

Paruchuri Gopala Krishna coments on Acharya movie and Koratala Siva
Paruchuri Gopala Krishna

స‌స్పెన్స్‌, సెంటిమెంట్ ఒకే ఒర‌లో ఇమ‌డ‌లేవ‌ని ప‌రుచూరి గోపాల కృష్ణ అన్నారు. ఈ విష‌యాన్ని కొర‌టాల గుర్తు పెట్టుకుంటే మంచిద‌ని ఆయ‌నకు క్లాస్ పీకారు. ఇక చ‌ర‌ణ్ పాత్ర‌ను సెకండాఫ్ వ‌ర‌కు సీక్రెట్‌గా ఉంచార‌ని.. అలాగే ముగింపు కూడా స‌రిగ్గా లేద‌ని.. ఫ‌స్టాఫ్‌లోనే చ‌ర‌ణ్‌ను చూపించి ఉంటే బాగుండేద‌ని అన్నారు. ఇలా ఆచార్య మూవీలో ఉన్న త‌ప్పుల గురించి ప‌రుచూరి గోపాల‌కృష్ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అయితే ఇప్పుడు ఎవ‌రెన్ని అన్నా.. సినిమా మాత్రం దారుణ డిజాస్ట‌ర్ టాక్‌ను తెచ్చుకుంది క‌నుక ఇప్పుడు ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు. ఇక‌పైనైనా ఇలాంటి క‌థ‌ల‌తో ప్ర‌యోగాలు చేయ‌కుండా ఉంటే మంచిద‌ని.. చిరు ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now