Marriage : ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు తమ కళ్ల ముందే చనిపోతే ఆ తల్లిదండ్రులకు ఉండే వ్యథ అంతా ఇంతా కాదు. తమకు వృద్ధాప్యంలో కొండంత అండగా ఉంటారనుకునే పిల్లలకు తామే తలకొరివి పెట్టాల్సి రావడం.. అంతకన్నా మించిన శోకం తల్లిదండ్రులకు ఇంకొకటి ఉండదు. ఆ తల్లిదండ్రులకు కూడా ఆ కొడుకు అలాంటి శోకాన్నే మిగిల్చాడు. అయితే కొడుకు పోయిన దుఃఖాన్ని మరిచిపోలేని ఆ దంపతులు అతనికి ఏకంగా గుడి కట్టి పూజిస్తున్నారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు తండాకు చెందిన భూక్యా లాలు, సుక్కమ్మ దంపతులకు రాంకోటి అనే కుమారుడితోపాటు ఓ కుమార్తె ఉంది. కాగా రాంకోటి అదే తండాకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. తమకు పెళ్లి చేయమని తమ పెద్దలను వారు అడిగారు. అయితే వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో మనస్థాపం చెందిన రాంకోటి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనతో అతని తల్లిదండ్రులు ఎంతో కుమిలిపోయారు. వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే ఈ సంఘటన జరిగింది.. 2003లో.
ఆ తరువాత ఒక రోజు తల్లి సుక్కమ్మకు తన కుమారుడు రాంకోటి కలలో కనిపించాడు. ప్రతి శ్రీరామనవమి రోజు తనకు పెళ్లి చేయాలని కోరాడు. దీంతో ఆ దంపతులు తమ ఇంటి ఆవరణలోనే ఉన్న ఖాళీ స్థలంలో తమ కొడుక్కి గుడి కట్టారు. అందులో తమ కుమారుడు రాంకోటితోపాటు ఓ యువతి విగ్రహాన్ని వారు ఏర్పాటు చేశారు. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలా వారి విగ్రహాలను అలంకరించారు. అనంతరం ఆ తండా వాసుల సమక్షంలో పెళ్లి చేశారు.
ఇలా ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజు తమ కుమారుడు కోరినట్లు వారు అతని విగ్రహానికి కల్యాణం జరిపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా శ్రీరామనవమి రోజున తమ బంధుమిత్రులు, స్థానికుల సమక్షంలో మరోమారు రాంకోటికి కళ్యాణం నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…