Marriage : ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు తమ కళ్ల ముందే చనిపోతే ఆ తల్లిదండ్రులకు ఉండే వ్యథ అంతా ఇంతా కాదు. తమకు వృద్ధాప్యంలో కొండంత అండగా ఉంటారనుకునే పిల్లలకు తామే తలకొరివి పెట్టాల్సి రావడం.. అంతకన్నా మించిన శోకం తల్లిదండ్రులకు ఇంకొకటి ఉండదు. ఆ తల్లిదండ్రులకు కూడా ఆ కొడుకు అలాంటి శోకాన్నే మిగిల్చాడు. అయితే కొడుకు పోయిన దుఃఖాన్ని మరిచిపోలేని ఆ దంపతులు అతనికి ఏకంగా గుడి కట్టి పూజిస్తున్నారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు తండాకు చెందిన భూక్యా లాలు, సుక్కమ్మ దంపతులకు రాంకోటి అనే కుమారుడితోపాటు ఓ కుమార్తె ఉంది. కాగా రాంకోటి అదే తండాకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. తమకు పెళ్లి చేయమని తమ పెద్దలను వారు అడిగారు. అయితే వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో మనస్థాపం చెందిన రాంకోటి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనతో అతని తల్లిదండ్రులు ఎంతో కుమిలిపోయారు. వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే ఈ సంఘటన జరిగింది.. 2003లో.
ఆ తరువాత ఒక రోజు తల్లి సుక్కమ్మకు తన కుమారుడు రాంకోటి కలలో కనిపించాడు. ప్రతి శ్రీరామనవమి రోజు తనకు పెళ్లి చేయాలని కోరాడు. దీంతో ఆ దంపతులు తమ ఇంటి ఆవరణలోనే ఉన్న ఖాళీ స్థలంలో తమ కొడుక్కి గుడి కట్టారు. అందులో తమ కుమారుడు రాంకోటితోపాటు ఓ యువతి విగ్రహాన్ని వారు ఏర్పాటు చేశారు. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలా వారి విగ్రహాలను అలంకరించారు. అనంతరం ఆ తండా వాసుల సమక్షంలో పెళ్లి చేశారు.
ఇలా ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజు తమ కుమారుడు కోరినట్లు వారు అతని విగ్రహానికి కల్యాణం జరిపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా శ్రీరామనవమి రోజున తమ బంధుమిత్రులు, స్థానికుల సమక్షంలో మరోమారు రాంకోటికి కళ్యాణం నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…