Pakka Commercial : మారుతి దర్శకత్వంలో గోపీచంద్, రాశిఖన్నా హీరో హీరోయిన్లుగా వస్తున్న మూవీ.. పక్కా కమర్షియల్. ఈ సినిమా జూలై 1వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ను లాంచ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. గోపీచంద్ గతంలో ఎన్నడూ లేనంతగా భిన్నమైన పాత్రలో ఈ మూవీలో కనిపించనున్నాడని సినిమాను చూస్తే అర్థమవుతుంది. మారుతి సినిమా కనుక ఎంటర్టైన్మెంట్ పక్కా ఉంటుంది. దీంతో ఈ మూవీపై గోపీచంద్ ఆశలు పెట్టుకున్నాడు.
ఇక పక్కా కమర్షియల్ సినిమాకు చెందిన డిజిటల్ హక్కులను రెండు ఓటీటీ ప్లాట్ఫామ్స్ సొంతం చేసుకున్నాయి. నెట్ఫ్లిక్స్, ఆహా సంస్థలు ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకున్నాయి. దీంతో ఈ రెండు యాప్లలోనూ మూవీ స్ట్రీమ్ కానుంది. ఇక సినిమా విడుదలయ్యాక 5 వారాలకు స్ట్రీమ్ చేసుకునేట్లుగా ఒప్పందం జరిగింది. కనుక ఆగస్టు మొదటి వారం తరువాత ఈ మూవీ ఓటీటీల్లోకి వస్తుందని చెప్పవచ్చు.
పక్కా కమర్షియల్ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు జేక్స్ బెజోయ్ సంగీతం అందిస్తుండగా.. కర్మ్ చావ్లా సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే గోపీచంద్కు వరుసగా అనేక ఫ్లాప్స్ వచ్చాయి. దీంతో ఈ మూవీపైనే ఆయన ఆశలు పెట్టుకున్నాడు. మరి ఏమవుతుందో చూడాలి.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…