Bahubali : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ రెండు పార్ట్లుగా వచ్చింది. మొదటి పార్ట్ కన్నా రెండో పార్ట్ మూవీయే అత్యధిక కలెక్షన్లను రాబట్టింది. ముఖ్యంగా మొదటి పార్ట్లో జక్కన్న పెట్టిన సస్పెన్స్ కారణంగానే రెండో పార్ట్ను చాలా మంది చూశారని చెప్పవచ్చు. అయితే రెండో పార్ట్లో మనకు యుద్ధం సీన్లో మహేంద్ర బాహుబలి భల్లాలదేవుడి కోటను బద్దలు కొట్టే సీన్ ఉంటుంది. ఆ సీన్లో తాటి చెట్లను చూపిస్తారు.
మహేంద్ర బాహుబలి తనకు ఉన్న కొద్దిపాటి సైన్యంతో భల్లాల దేవుడి కోట మీదకు యుద్ధానికి వస్తాడు. అయితే కోట ప్రధాన ద్వారం మూసివేస్తారు. దీంతో కోటలోకి కచ్చితంగా వేరే మార్గంలో ప్రవేశించాల్సి వస్తుంది. అప్పుడు తాటి చెట్ల సహాయంతో లోపలికి చేరుకుంటారు. ముగ్గురు, నలుగురు కలసి జట్టుగా ఏర్పడి చుట్టూ రక్షణ కవచాలను పెట్టుకుని తాటి చెట్టును సాగదీసి విడిచిపెడతారు. దీంతో ఆ ఊపు, వేగానికి కోటలో ఎగురుకుంటూ వెళ్లి పడతారు. అయితే సినిమాలో తాటి చెట్లను సులభంగా వంగేలా చేయవచ్చు.. అన్నట్లుగా చూపించారు. దీని గురించి ఎవరూ ఆలోచించలేదు. కానీ వాస్తవానికి తాటి చెట్లు అలా వంగుతాయా ? వాటిని వంచగలమా ? ఇందుకు సైన్స్ ఏమని సమాధానం చెబుతోంది ? అంటే..
తాటి చెట్లు వంగే గుణాన్ని కలిగి ఉంటాయి. కరెక్టే. కానీ బాహుబలి సినిమాలో చూపించినంత రబ్బరులా వంగవు. కేవలం 50 డిగ్రీల కోణం వరకు మాత్రమే వంగగలవు. అంతకు మించి ప్రయత్నిస్తే అవి విరిగిపోతాయి. కనుక అలా చూపించడం సినిమాల వరకే. వాస్తవానికి అది సాధ్యపడదని చెప్పవచ్చు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…