Tollywood : ప్రస్తుత తరుణంలో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాదు.. సాధారణ ప్రజల్లోనూ ఈ కల్చర్ పెరిగిపోయింది. మారుతున్న జీవనశైలి, వ్యవహారాలు, ప్రవర్తన, ఉద్యోగాలు, ఇతర సంబంధాలు, ఆర్థిక సమస్యలు.. ఇవన్నీ విడాకులకు కారణం అవుతున్నాయి. ఇక సెలబ్రిటీలు అయితే చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు. టాలీవుడ్ క్యూట్ కపుల్గా పేరు గాంచిన సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్కు గురి చేశారు. తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్, ధనుష్లు విడాకులు తీసుకున్నారు. ఇలా సెలబ్రిటీ కపుల్స్ చాలా మంది ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకుంటున్నారు. ఇక త్వరలోనే మరో టాలీవుడ్ జంట కూడా విడాకులు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్కు చెందిన ఓ జంట త్వరలో విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. వారు విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించకపోయినా ఫిలిం నగర్లో మాత్రం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వారు తెలుగు వెండితెరతోపాటు బుల్లితెరపై కూడా పలు కార్యక్రమాల్లో సందడి చేశారు. వారి ఒక పాప ఉంది. ఇద్దరూ సింగర్స్గా బాగానే సంపాదిస్తున్నారు. అయితే వీరు త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని తెలుస్తోంది.
కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఎంతో చెప్పి చూశారట. అయినప్పటికీ వారు విడాకులు తీసుకునేందుకే మొగ్గు చూపుతున్నారట. దీంతో చుట్టూ ఉన్నవారు చేసేదేం లేక అలాగే ఉండిపోయారట. ఈ క్రమంలోనే వారి విడాకులు దాదాపుగా ఖాయం అయిపోయినట్లేనని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి వారు ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ విడాకులకు దారి తీసిన కారణాలు ఏమిటనేది తెలియడం లేదు. భార్యభర్త ఇద్దరూ సంపాదిస్తున్నారు కనుక.. ఇద్దరికీ ఆర్థిక స్వాతంత్య్రం ఉంటుంది. అదే సమస్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే వీరి విడాకుల విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…