Tollywood : ప్రస్తుత తరుణంలో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాదు.. సాధారణ ప్రజల్లోనూ ఈ కల్చర్ పెరిగిపోయింది. మారుతున్న జీవనశైలి, వ్యవహారాలు, ప్రవర్తన, ఉద్యోగాలు, ఇతర సంబంధాలు, ఆర్థిక సమస్యలు.. ఇవన్నీ విడాకులకు కారణం అవుతున్నాయి. ఇక సెలబ్రిటీలు అయితే చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు. టాలీవుడ్ క్యూట్ కపుల్గా పేరు గాంచిన సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్కు గురి చేశారు. తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్, ధనుష్లు విడాకులు తీసుకున్నారు. ఇలా సెలబ్రిటీ కపుల్స్ చాలా మంది ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకుంటున్నారు. ఇక త్వరలోనే మరో టాలీవుడ్ జంట కూడా విడాకులు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్కు చెందిన ఓ జంట త్వరలో విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. వారు విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించకపోయినా ఫిలిం నగర్లో మాత్రం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వారు తెలుగు వెండితెరతోపాటు బుల్లితెరపై కూడా పలు కార్యక్రమాల్లో సందడి చేశారు. వారి ఒక పాప ఉంది. ఇద్దరూ సింగర్స్గా బాగానే సంపాదిస్తున్నారు. అయితే వీరు త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని తెలుస్తోంది.
కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఎంతో చెప్పి చూశారట. అయినప్పటికీ వారు విడాకులు తీసుకునేందుకే మొగ్గు చూపుతున్నారట. దీంతో చుట్టూ ఉన్నవారు చేసేదేం లేక అలాగే ఉండిపోయారట. ఈ క్రమంలోనే వారి విడాకులు దాదాపుగా ఖాయం అయిపోయినట్లేనని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి వారు ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ విడాకులకు దారి తీసిన కారణాలు ఏమిటనేది తెలియడం లేదు. భార్యభర్త ఇద్దరూ సంపాదిస్తున్నారు కనుక.. ఇద్దరికీ ఆర్థిక స్వాతంత్య్రం ఉంటుంది. అదే సమస్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే వీరి విడాకుల విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…