సోషల్ కంటెంట్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ప్రేక్షకులను మెప్పించే డైరెక్టర్ కొరటాల శివ. అలాంటి డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నారంటే అంచనాలు మామూలుగా ఉండవు. అందులోనూ చిరు, చరణ్ కలిసి నటిస్తున్నారంటే ఫ్యాన్స్ కి పండగే అనుకున్నారు. కానీ ఆచార్య సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన అభిమానులకు కథ ఏమిటి అని ఆలోచిస్తే.. పెద్దగా ఏమీ గుర్తు రాదు..!? దర్శకత్వంలో, సంభాషణల్లో కొరటాల మార్క్ మిస్ అయింది.
దీంతో ఆచార్య ఎఫెక్ట్ మెగాస్టార్ చిరంజీవిపై పడింది. సినిమా బాక్సాఫీస్ పరాజయం ఒకెత్తయితే.. దీంతో చిరంజీవి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురయ్యారు. శనివారం తెల్లవారు జామున చిరంజీవి బింబిసార, సీతా రామం గురించి ట్వీట్ చేశారు. ఆ సినిమాలకు వస్తున్న పాజిటివ్ బజ్ పై వారికి అభినందనలు తెలిపారు మెగాస్టార్.
అయితే దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. నువ్వు సినిమాలు చేయడం మానేస్తే ఇండస్ట్రీ బాగుపడుతుంది, డిస్ట్రిబ్యూటర్లు కూడా బాగుంటారు ప్లీజ్ టాలీవుడ్ ని కాపాడండి బాసు.. అని కామెంట్ చేశాడు. మెగాస్టార్, రామ్ చరణ్.. అబ్బా, కొడుకులు చేసిన లాస్ ఎఫెక్ట్ ని కళ్యాణ్ రామ్ ఎత్తి పడేశాడు. నీకెందుకు మెగాస్టార్ ట్యాగ్ చెప్పు.. అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
అయితే చిరంజీవి లాంటి మెగాస్టార్ని ఇలా కించపరిచేలా ఒక్క ఫ్లాప్ని వాడుకోవడం పూర్తిగా అన్యాయం అనే చెప్పవచ్చు. సోషల్ మీడియా ట్రోల్స్ ఒక విషయం అయితే.. ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో చిరుని తక్కువ చేసి మాట్లాడడం సరైంది కాదు.. అని మెగా ఫ్యామిలీ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…