సోషల్ కంటెంట్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ప్రేక్షకులను మెప్పించే డైరెక్టర్ కొరటాల శివ. అలాంటి డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నారంటే అంచనాలు మామూలుగా ఉండవు. అందులోనూ చిరు, చరణ్ కలిసి నటిస్తున్నారంటే ఫ్యాన్స్ కి పండగే అనుకున్నారు. కానీ ఆచార్య సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన అభిమానులకు కథ ఏమిటి అని ఆలోచిస్తే.. పెద్దగా ఏమీ గుర్తు రాదు..!? దర్శకత్వంలో, సంభాషణల్లో కొరటాల మార్క్ మిస్ అయింది.
దీంతో ఆచార్య ఎఫెక్ట్ మెగాస్టార్ చిరంజీవిపై పడింది. సినిమా బాక్సాఫీస్ పరాజయం ఒకెత్తయితే.. దీంతో చిరంజీవి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురయ్యారు. శనివారం తెల్లవారు జామున చిరంజీవి బింబిసార, సీతా రామం గురించి ట్వీట్ చేశారు. ఆ సినిమాలకు వస్తున్న పాజిటివ్ బజ్ పై వారికి అభినందనలు తెలిపారు మెగాస్టార్.
అయితే దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. నువ్వు సినిమాలు చేయడం మానేస్తే ఇండస్ట్రీ బాగుపడుతుంది, డిస్ట్రిబ్యూటర్లు కూడా బాగుంటారు ప్లీజ్ టాలీవుడ్ ని కాపాడండి బాసు.. అని కామెంట్ చేశాడు. మెగాస్టార్, రామ్ చరణ్.. అబ్బా, కొడుకులు చేసిన లాస్ ఎఫెక్ట్ ని కళ్యాణ్ రామ్ ఎత్తి పడేశాడు. నీకెందుకు మెగాస్టార్ ట్యాగ్ చెప్పు.. అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
అయితే చిరంజీవి లాంటి మెగాస్టార్ని ఇలా కించపరిచేలా ఒక్క ఫ్లాప్ని వాడుకోవడం పూర్తిగా అన్యాయం అనే చెప్పవచ్చు. సోషల్ మీడియా ట్రోల్స్ ఒక విషయం అయితే.. ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో చిరుని తక్కువ చేసి మాట్లాడడం సరైంది కాదు.. అని మెగా ఫ్యామిలీ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…