కలెక్షన్ కింగ్ వారసురాలిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మంచు లక్ష్మి. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా టీవీ షోస్, కొన్ని అవార్డ్ ఫంక్షన్స్ లో యాంకర్ గా కూడా అలరించారు మంచు లక్ష్మి. అయితే సినిమాల ద్వారా పెద్దగా గుర్తింపు సాధించలేదు మంచు వారసురాలు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో అభిమానులతో అనేక విషయాలు పంచుకుంటారు. అయితే మంచు లక్ష్మి పెట్టిన అనేక పోస్ట్స్ వైరల్ అవుతూ ట్రోలింగ్ కి గురవుతుంటాయి.
మంచు ఫ్యామిలీ నుంచి ఎవరు పోస్ట్ చేసినా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు కానీ మంచు లక్ష్మి ఎక్కువగా పోస్టులు చేయడం వల్ల ఎక్కువ ట్రోలింగ్ కి గురవుతారు. ఇది ఇలా ఉండగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా మంచు లక్ష్మి తనకు తెలుగు చదవడం, రాయడం రాదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు రాదు అనడంతో నెటిజన్లు లక్ష్మిని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నటీమణులు కూడా తక్కువ కాలంలోనే తెలుగు నేర్చుకుంటున్నారు. ఈమె మాత్రం తెలుగు గడ్డపై పుట్టి అమెరికాలో పెరిగినంత మాత్రాన తెలుగు రాకపోవడం ఏంటీ.. అని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా మంచి లక్ష్మి నిజం చెప్పి అడ్డంగా బుక్ అయింది.
ఇటీవల మంచు లక్ష్మి 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంది. మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 50 గవర్నమెంట్ స్కూళ్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. ప్రైవేటు పాఠశాలలను మరిపించేలా స్మార్ట్ క్లాసెస్ ను ప్రారంభిస్తామని తెలిపింది. దీంతో ఆమెను నెటిజన్లు అభినందించారు. కానీ తాజాగా తెలుగు రాదనడంతో మళ్లీ వారు ట్రోల్ చేస్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…