కలెక్షన్ కింగ్ వారసురాలిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మంచు లక్ష్మి. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా టీవీ షోస్, కొన్ని అవార్డ్ ఫంక్షన్స్ లో యాంకర్ గా కూడా అలరించారు మంచు లక్ష్మి. అయితే సినిమాల ద్వారా పెద్దగా గుర్తింపు సాధించలేదు మంచు వారసురాలు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో అభిమానులతో అనేక విషయాలు పంచుకుంటారు. అయితే మంచు లక్ష్మి పెట్టిన అనేక పోస్ట్స్ వైరల్ అవుతూ ట్రోలింగ్ కి గురవుతుంటాయి.
మంచు ఫ్యామిలీ నుంచి ఎవరు పోస్ట్ చేసినా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు కానీ మంచు లక్ష్మి ఎక్కువగా పోస్టులు చేయడం వల్ల ఎక్కువ ట్రోలింగ్ కి గురవుతారు. ఇది ఇలా ఉండగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా మంచు లక్ష్మి తనకు తెలుగు చదవడం, రాయడం రాదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు రాదు అనడంతో నెటిజన్లు లక్ష్మిని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నటీమణులు కూడా తక్కువ కాలంలోనే తెలుగు నేర్చుకుంటున్నారు. ఈమె మాత్రం తెలుగు గడ్డపై పుట్టి అమెరికాలో పెరిగినంత మాత్రాన తెలుగు రాకపోవడం ఏంటీ.. అని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా మంచి లక్ష్మి నిజం చెప్పి అడ్డంగా బుక్ అయింది.
ఇటీవల మంచు లక్ష్మి 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంది. మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 50 గవర్నమెంట్ స్కూళ్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. ప్రైవేటు పాఠశాలలను మరిపించేలా స్మార్ట్ క్లాసెస్ ను ప్రారంభిస్తామని తెలిపింది. దీంతో ఆమెను నెటిజన్లు అభినందించారు. కానీ తాజాగా తెలుగు రాదనడంతో మళ్లీ వారు ట్రోల్ చేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…