Anushka Shetty : అనుష్క శెట్టి అసలు వివాదాల్లో చిక్కుకోదు. ఆమె అసలు సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటుంది. ఈమెకు ఆఫర్లు లేవు. మొన్నా మధ్య వచ్చిన నిశ్శబ్దం మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. దీంతో మళ్లీ ఈమె తెరమరుగు అయిపోయింది. అయితే త్వరలోనే నవీన్ పొలిశెట్టితో ఓ మూవీ చేయనుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇతర హీరోయిన్లలా అనుష్క శెట్టి గ్లామర్ ఫొటోలను షేర్ చేయడం లేదు. అసలు తన అప్ డేట్స్ గురించి కూడా ఆమె సోషల్ మీడియాలో ఏమీ పోస్ట్ చేయడం లేదు. కానీ లేటెస్ట్గా ఆమె చేసిన పోస్ట్కు పాజిటివ్ గా స్పందన రాకపోగా.. నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
అనుష్క శెట్టి ఇటీవలే తన సోదరుడి బర్త్ డే సందర్భంగా ఆయనతో కలసి తీసుకున్న ఓ ఫొటోను షేర్ చేసింది. అయితే అది ఏమాత్రం క్లారిటీ లేదు. చూస్తుంటే ఆమె తన దగ్గర ఉన్న ఫిజికల్ ఫొటోను స్కాన్ చేసి దాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టినట్లు స్పష్టమవుతోంది. దీంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇతర హీరోయిన్లు ఓ వైపు అద్భుతమైన క్లారిటీ కలిగిన ఫొటోలను షేర్ చేస్తుంటే.. నువ్వ ఇలాంటి ఫొటోను పోస్ట్ చేశావేంటి.. అసలు ఎలాంటి ఫొటోలను షేర్ చేయాలో తెలియదా.. అంటూ స్వీటీపై నెటిజన్లు విమర్శలు చేస్తూ.. ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
కాగా అనుష్క శెట్టి 2005లో వచ్చిన సూపర్ సినిమాతో సినీ తెరకు పరిచయం అయింది. అందులో సాషాగా ఆకట్టుకుంది. ఈ మూవీలో నాగార్జునతోపాటు సోనూసూద్, ఆయేషా టకియాలు నటించారు. తరువాత అనేక సినిమాలు చేసింది. కానీ చాలా వరకు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. రవితేజతో చేసిన విక్రమార్కుడు, లేడీ ఓరియెంటెడ్ సినిమా అరుంధతి, తమిళంలో సూర్యతో కలసి చేసిన సింగం 2, బాహుబలి, మిర్చి వంటి సినిమాలు ఈమెకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. ఈమె చివరిసారిగా 2020లో నిశ్శబ్దం అనే మూవీతో పలకరించింది. తరువాత నుంచి ఖాళీగానే ఉంటోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…