Naga Chaitanya : టాలీవుడ్ క్యూట్ కపుల్గా పేరుగాంచిన సమంత, నాగచైతన్య ఉన్నట్లుండి సడెన్ గా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఎవరికీ నచ్చలేదు. ఈ వార్తను చదివి అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అసలు వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారు.. ప్రేమించే పెళ్లి చేసుకున్నారు కదా.. అనే సందేహాలు అందరికీ వచ్చాయి. అయితే వీరి విడాకులకు కారణం ఇప్పటి వరకు తెలియలేదు. కానీ తాజాగా ఓ సంచలన విషయం మాత్రం బయటకు వచ్చింది.
నాగచైతన్య ఇటీవలే థాంక్ యూ అనే మూవీ షూటింగ్ను పూర్తి చేసిన విషయం విదితమే. ఇందులో అవికా గోర్, రాశి ఖన్నా కూడా నటించారు. అయితే తాజాగా చైతూ అమెజాన్ ప్రైమ్ తెరకెక్కిస్తున్న దూత అనే సిరీస్లో నటిస్తున్నాడు. ఇందులో చైతూ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సిరీస్ ను చైతూ చేసేందుకు సమంతనే కారణమట. అప్పట్లో ఈ సిరీస్ను చేయాల్సిందిగా సమంత.. చైతూను బలవంత పెట్టిందట. ఆమెతో కలసి ఉన్న సమయంలో చైతూ సినిమాల వ్యవహారాలను ఆమెనే దగ్గరుండి చూసుకునేదట. కనుకనే దూత సిరీస్ చేయాల్సిందిగా పట్టుబట్టిందట. దీంతో ఆమె ఒత్తిడి మేరకు చైతూ తనకు ఇష్టం లేకపోయినా ఈ సిరీస్ను చేసేందుకు అంగీకరిస్తూ.. పత్రాలపై సంతకం చేశాడట. అయితే ఈ విషయంలో ఎంత నిజం ఉంది.. అన్నది తెలియదు కానీ.. ప్రస్తుతానికి చైతూ అయితే ఈ సిరీస్ చేస్తున్నాడు. మరి ఇందులో చైతూది నిజంగానే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రేనా.. కాదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
ఇక సమంత తన పెళ్లి విషయంలోనూ చైతూ తల్లిదండ్రులను బలవంతంగా ఒప్పించిందట. అప్పట్లో అఖిల్ నిశ్చితార్థం ఆగిపోయింది. దీంతో సమంతతో పెళ్లి వద్దని.. ఇంకో అమ్మాయిని చేసుకోవాలని నాగార్జున చైతూకు చెప్పారట. కానీ సమంత వారిని బలవంతంగా ఒప్పించి చైతన్యను వివాహం చేసుకుందట. ఈ విషయం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే వీరు విడాకుల విషయాన్ని ప్రకటించినప్పటి నుంచి ఇలాగే ఎన్నో వార్తలు హల్ చల్ చేశాయి. కానీ వీటిలో నిజం ఎంత ఉంది అన్నది తెలియలేదు. అలాగే ఈ విషయాలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఎప్పటికైనా నిజం బయట పడక తప్పదు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…