Naga Chaitanya : టాలీవుడ్ క్యూట్ కపుల్గా పేరుగాంచిన సమంత, నాగచైతన్య ఉన్నట్లుండి సడెన్ గా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఎవరికీ నచ్చలేదు. ఈ వార్తను చదివి అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అసలు వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారు.. ప్రేమించే పెళ్లి చేసుకున్నారు కదా.. అనే సందేహాలు అందరికీ వచ్చాయి. అయితే వీరి విడాకులకు కారణం ఇప్పటి వరకు తెలియలేదు. కానీ తాజాగా ఓ సంచలన విషయం మాత్రం బయటకు వచ్చింది.
నాగచైతన్య ఇటీవలే థాంక్ యూ అనే మూవీ షూటింగ్ను పూర్తి చేసిన విషయం విదితమే. ఇందులో అవికా గోర్, రాశి ఖన్నా కూడా నటించారు. అయితే తాజాగా చైతూ అమెజాన్ ప్రైమ్ తెరకెక్కిస్తున్న దూత అనే సిరీస్లో నటిస్తున్నాడు. ఇందులో చైతూ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సిరీస్ ను చైతూ చేసేందుకు సమంతనే కారణమట. అప్పట్లో ఈ సిరీస్ను చేయాల్సిందిగా సమంత.. చైతూను బలవంత పెట్టిందట. ఆమెతో కలసి ఉన్న సమయంలో చైతూ సినిమాల వ్యవహారాలను ఆమెనే దగ్గరుండి చూసుకునేదట. కనుకనే దూత సిరీస్ చేయాల్సిందిగా పట్టుబట్టిందట. దీంతో ఆమె ఒత్తిడి మేరకు చైతూ తనకు ఇష్టం లేకపోయినా ఈ సిరీస్ను చేసేందుకు అంగీకరిస్తూ.. పత్రాలపై సంతకం చేశాడట. అయితే ఈ విషయంలో ఎంత నిజం ఉంది.. అన్నది తెలియదు కానీ.. ప్రస్తుతానికి చైతూ అయితే ఈ సిరీస్ చేస్తున్నాడు. మరి ఇందులో చైతూది నిజంగానే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రేనా.. కాదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
ఇక సమంత తన పెళ్లి విషయంలోనూ చైతూ తల్లిదండ్రులను బలవంతంగా ఒప్పించిందట. అప్పట్లో అఖిల్ నిశ్చితార్థం ఆగిపోయింది. దీంతో సమంతతో పెళ్లి వద్దని.. ఇంకో అమ్మాయిని చేసుకోవాలని నాగార్జున చైతూకు చెప్పారట. కానీ సమంత వారిని బలవంతంగా ఒప్పించి చైతన్యను వివాహం చేసుకుందట. ఈ విషయం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే వీరు విడాకుల విషయాన్ని ప్రకటించినప్పటి నుంచి ఇలాగే ఎన్నో వార్తలు హల్ చల్ చేశాయి. కానీ వీటిలో నిజం ఎంత ఉంది అన్నది తెలియలేదు. అలాగే ఈ విషయాలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఎప్పటికైనా నిజం బయట పడక తప్పదు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్దీప్ సింగ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…