తెలుగు బుల్లితెర చరిత్రలోనే టాప్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. భారీ అంచనాల నడుమ సీజన్ 6 తాజాగా మొదలైంది. ముందు నుంచే షో నిర్వాహకులు సీజన్ 6 పై అంచనాలు పెంచారు. ఇందులో సెలబ్రిటీలతోపాటు సామాన్యులు సైతం పాల్గొంటారని ప్రచారం చేశారు. కానీ తాజా ఎపిసోడ్ చూస్తే సామాన్యుల ఊసే లేదు. తాజాగా ప్రకటించిన కంటెస్టెంట్స్ లిస్ట్లో ఒక్కరు కూడా సామాన్యుడు లేడు.
కీర్తిభట్, సుదీప, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్, గలాటా గీతు, అభినయ శ్రీ, రోహిత్ సాహ్ని, మరీనా, బాలాదిత్య, వాసంతి క్రిష్ణన్, షాని సాల్మన్, ఇనయ సుల్తానా, ఆర్జే సూర్య, జబర్దస్త్ ఫైమా, రాజేశేఖర్, అరోహి రావ్, సింగర్ రేవంత్, యూట్యూబర్ ఆదిరెడ్డి. ఇలా హౌస్లో 21 మంది సెలబ్రిటీలను హౌస్లోకి పంపారు. యూట్యూబర్ ఆది రెడ్డిని కామనర్ అని ఇంట్రడ్యూస్ చేసాడు హోస్ట్ నాగార్జున. ఆ తర్వాత అతను పెద్ద యూట్యూబర్ అని.. లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని.. బిగ్ బాస్ రివ్యూలతో పాపులర్ అయ్యారని కూడా స్పెషల్ వీడియో వేసి మరీ చూపించారు.
అంటే ఎంతో కొంత పాపులారిటీ ఉన్న వారిని హౌజ్లోకి పంపుతూ ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారే తప్ప.. బిగ్ బాస్ సామాన్యులకు అవకాశం కల్పిస్తాం అని చెప్పి.. ఆడిషన్స్ చేసి ఇప్పుడు ఛీటింగ్ చేశారంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సామాన్యులకు బంపర్ ఆఫర్ అంటూ నాగార్జున అధికారికంగా మే నెలలో విడుదల చేసిన ప్రోమోను యూట్యూబ్ నుంచి తొలగించారు. దీన్ని బట్టి కావాలనే సామాన్యుడ్ని ఛీట్ చేశారని స్పష్ఠం అవుతోంది. ఎప్పటి మాదిరిగానే ఈ సారి బిగ్ బాస్ హౌజ్ లో వివిధ రంగాలకు చెందిన సెలబ్రెటీలు ఉన్నారు. దీనిపై స్టార్ మా ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…