Naga Chaitanya : ఏ మాయ చేశావే సినిమాలో జంటగా నటించి నిజ జీవితంలో కూడా ఒక్కటైన జంట సమంత, నాగచైతన్య. వీరిని అభిమానులు ముద్దుగా చై సామ్ అని పిలుచుకుంటారు. ఈ టాలీవుడ్ స్టార్ కపుల్ గతేడాది విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. కొన్నాళ్ళ పరిచయం, ఎన్నో ఏళ్ల ప్రేమ.. అనంతరం పెళ్లి చేసుకున్న ఈ జంట ఐదేళ్లకే వీరి వైవాహిక జీవితానికి శుభం కార్డు వేశారు. చూడముచ్చటగా ఉన్న ఈ జంట విడాకులు ఎందుకు తీసుకున్నారు అని మాత్రం ఎవరికీ తెలీదు. కానీ ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకుంటున్నారు. తాజాగా సమంత తండ్రి అయిన జోసెఫ్ ప్రభు ఫేస్ బుక్ లో చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతుంది.
లాంగ్ లాంగ్ ఎగో దేర్ వాస్ ఏ స్టోరీ అంటూ ఆయన ఇంగ్లీషులో ఒక పోస్ట్ పెట్టాడు.. సమంత తండ్రి జోసెఫ్ చేసిన పోస్ట్ అర్థం ఏంటి అంటే.. ఒకానొక సమయంలో ఒక కథ ఉండేది, కానీ ఇప్పుడు అది లేదు.. ఆ కథ ఇక ఎప్పటికీ ఉండదు. కనుక ఇప్పుడు కొత్త కథను మొదలు పెట్టాలి, కొత్త చాప్టర్ మొదలు పెట్టాల్సిన సమయం వచ్చింది అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నాగ చైతన్య అభిమానులతో పాటు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సడన్ గా సమంత తండ్రి ఈ పోస్ట్ పెట్టడానికి గల కారణం ఏంటి అంటూ చర్చ జరుగుతుంది. ఈ సమయంలో సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. సమంత మరియు నాగచైతన్య కు అధికారికంగా విడాకులు వచ్చాయి.
కనుక ఈ సందర్భంగా ఆయన ఈ పోస్ట్ పెట్టాడు అంటూ కొందరు అంటున్నారు. అసలు విషయం ఏంటి అనేది ఆయన చెప్తే కానీ తెలీదు. సమంత లేదా ఆమెకు సంబంధించిన వారు ఎవరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా అది నాగ చైతన్యకు లింక్ చేసి ఏదో ఒక రకంగా పుకార్లు షికార్లు చేయడం ఈ మధ్య కామన్ అయిపోయింది. ప్రస్తుతం చైతన్య, సమంత కెరీర్ పరంగా బిజీ అయిపోయారు. చైతూ పరశురాం దర్శకత్వంలో ఒక సినిమాను, వెంకట్ ప్రభు దర్శకత్వంలో మరో సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే సామ్ ఖుషి, యశోద, శాకుంతలంతో పాటు బాలీవుడ్ లో ఓ వెబ్ సెరీస్ లో నటిస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…