Neha Shetty : సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం.. డీజే టిల్లు. ఈ సినిమాని సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. విమల కృష్ణ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 11వ తేదీన ఈ మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ను వేగవంతం చేసింది.
ఈ మూవీకి చెందిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ను ఇటీవలే హైదరాబాద్లో నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్లో ఓ జర్నలిస్టు చిత్ర యూనిట్ను ఇబ్బంది పెట్టే ప్రశ్న అడిగాడు. చిత్ర ట్రైలర్లో హీరో హీరోయిన్ను నీ ఒంటి మీద ఎన్ని పుట్టు మచ్చలు ఉన్నాయి.. అని అడుగుతాడు. దీంతో హీరోయిన్ 16 అని చెబుతుంది. అయితే ఇదే విషయాన్ని తీసుకున్న సదరు జర్నలిస్టు హీరోయిన్ను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీ ఒంటి మీద నిజంగానే 16 పుట్టు మచ్చలు ఉన్నాయా, హీరో ఆ విషయం నిర్దారించుకున్నాడా.. అని అడిగాడు.
అయితే ఈ ప్రశ్నకు ఒక్కసారిగా షాక్ అయిన సిద్ధు.. దీన్ని అవాయిడ్ చేద్దామని అన్నాడు. కానీ నేహా శెట్టి మాత్రం దీన్ని సీరియస్గానే తీసుకుంది. తరువాత ఆమె ట్విట్టర్ లో ఈ విషయంపై పోస్ట్ పెట్టింది. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం అని, అలాంటి జర్నలిస్టులకు స్త్రీల పట్ల, తన చుట్టూ కుటుంబంలో, పనిచేసే చోట ఉండే మహిళల పట్ల ఎంతటి గౌరవం ఉందో తెలుస్తూనే ఉందని.. పోస్ట్ పెట్టింది.
ఇక దీనిపై నిర్మాత నాగవంశీ హీరోయిన్కు క్షమాపణలు కూడా చెప్పారట. అయితే ఈ మధ్య కాలంలో యూట్యూబ్ చానల్స్ బాగా పుట్టుకొచ్చి.. మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలకు చెందిన ఫిలిం జర్నలిస్టులు ఈవెంట్లకు హాజరు కావడం లేదు. దీంతో యూట్యూబ్ చానల్స్ నుంచి కొందరు తాము జర్నలిస్టులమని చెప్పుకుంటూ ఇలాంటి ప్రెస్ మీట్ లకు, ఈవెంట్లకు వస్తున్నారు. వారికి ఏం ప్రశ్నలు అడగాలో తెలియడం లేదు. అందుకనే ఇలాంటి సంఘటన జరిగిందని అంటున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…