Narasimha Naidu : నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరక్టర్ బి.గోపాల్ డైరక్షన్ లో వచ్చిన సినిమా నరసింహ నాయుడు. ఆల్రెడీ సమరసింహా రెడ్డి తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన డైరక్టర్ గోపాల్ మరోసారి బాలయ్యతో నరసింహ నాయుడు సినిమాను తెరకెక్కించారు. 2001 సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటింది. అప్పటివరకు బాలకృష్ణ కెరియర్ లోనే కాదు సినీ పరిశ్రమలో ఇదివరకు ఏ సినిమా సృష్టించని రికార్డులను సృష్టించింది. 104 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రూ.30 కోట్ల దాకా వసూళ్లని రాబట్టింది.
ఇక ఈ సినిమాకు కథని చిన్ని కృష్ణ అందించారు. పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ రాశారు. అయితే ఈ సినిమా కథని బీహార్ లో జరిగిన యదార్థ సంఘటనలను ఆధారంగా తీసుకుని రాసినట్టు రైటర్ చిన్ని కృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 30 ఏళ్ల క్రితం బీహార్ లో కొందరు రౌడీ మూక గ్రామాలపై దాడి చేస్తుంటే.. వాళ్లని ఎదుర్కునేందుకు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు. దానికోసం ఆ గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఒక మగ పిల్ల వాడిని ఆ సైన్యానికి అప్పగించేవారట. అప్పగించిన ఆ మగ పిల్లాడిపై ఆశలు వదులుకోవాల్సిందేనట. ఇదే లైన్ తో చిన్ని కృష్ణ నరసింహ నాయుడు కథ రాసుకున్నారు.
సమర్ సింహా రెడ్డి, నరసింహ నాయుడు సినిమాల తర్వాత టాలీవుడ్ లో ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ బాగా నడిచింది. ఇలాంటి సినిమాలకు బాలయ్య కేరాఫ్ అడ్రెస్ గా మారారు. బాలకృష్ణ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తే సూపర్ హిట్టే అన్న టాక్ వచ్చింది. అయితే ఆ తర్వాత కూడా బాలకృష్ణ అలాంటి కథలు చేయగా అవి మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేదు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…