Balakrishna : అఖండతో సెన్సేషనల్ హిట్ అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఎన్.బి.కె 107 సినిమాగా వస్తున్న ఈ మూవీ నుంచి వస్తున్న ప్రచార చిత్రాలు ఇప్పటికే సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు అనిల్ రావిపుడితో సినిమా ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. పటాస్ టు F3 సక్సెస్ ఫుల్ డైరక్టర్ గా తన సత్తా చాటుతున్న అనిల్ రావిపుడి బాలయ్య బాబుతో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.
ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ స్టార్ డైరక్టర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నారని టాక్. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ 30వ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు కొరటాల శివ. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత బాలయ్యతో ఒక మూవీ అనుకుంటున్నారు కొరటాల శివ. కరోనా లాక్ డౌన్ టైం లో బాలకృష్ణ ఇమేజ్ కి సరిపడే ఒక కథ రాసుకున్నారట కొరటాల శివ. ఆ కథని బాలయ్యకి కూడా వినిపించగా ఓకే అనేశారట. కొరటాల శివ కథ రాసుకున్నప్పుడే బాలయ్య సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నారట. మోనార్క్ టైటిల్ తో ఈ సినిమా వస్తుందని చెబుతున్నారు.
గోపీచంద్ మలినేని డైరక్షన్ లో సినిమా పూర్తి కాగానే అనిల్ రావిపూడి సినిమాను లైన్ లో పెట్టిన బాలకృష్ణ ఆ తర్వాత కొరటాల శివ సినిమానే చేస్తారని తెలుస్తోంది. అఖండ తర్వాత సినిమాల విషయంలో దూకుడు చూపిస్తున్నారు బాలయ్య బాబు. ఈసారి వరుసగా స్టార్ డైరక్టర్స్ తో బాలకృష్ణ సినిమాలు చేస్తున్నారు. తప్పకుండా ఈ సినిమాలన్నీ నందమూరి ఫ్యాన్స్ అంచనాలను మించేలా ఉంటాయని చెప్పొచ్చు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…