Nara Rohith : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా వైసీపీ ప్రజా ప్రతినిధులు తనపై తన సతీమణి భువనేశ్వరిపై దారుణమైన వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు నాయుడు విలపించిన విషయం విదితమే. అయితే ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలోనూ తీవ్ర దూమారం రేపుతోంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ నుంచి వాకౌట్ అయిన చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో భోరున విలపించారు. ఇక ఈ ఘటనపై పలువురు సినీ హీరోలు స్పందిస్తున్నారు.
ఇప్పటికే బాలకృష్ణ, ఎన్టీఆర్ ఈఘటనపై స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా నటుడు నారా రోహిత్ స్పందించారు. అధికారంలో ఉన్న కొందరు నేతలు పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారని, ప్రజా సమస్యలపై చర్చలు జరగాల్సిన సభలో అధికార పక్షం.. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరిలను ఉద్దేశించి అసభ్య పదజాలంతో మాట్లాడటం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు.
రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్ర హక్కును దుర్వినియోగం చేస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడటం సబబు కాదని రోహిత్ అన్నారు. శిశుపాలుడి మాదిరిగానే వైసీపీ నాయకుల 100 తప్పులు పూర్తయ్యాయని, ఇక తెలుగుదేశం కార్యకర్తలు వైసీపీ దుశ్శాసనుల భరతం పట్టే సమయం ఆసన్నమైందని, స్థాయి లేని వ్యక్తుల మధ్య రాజకీయాలు చేయాల్సి రావడం దురదృష్టకరం పెదనాన్న.. అంటూ నారా రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…