Pawan Kalyan Venkatesh : టాలీవుడ్లో మల్టీ స్టారర్ క్రేజ్ నడుస్తోంది. స్టార్ హీరోలు కూడా ఎక్కువ ఆసక్తి చూపుతుండడంతో అనేక మల్టీ స్టారర్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. త్వరలో పవన్ కళ్యాణ్ – వెంకటేష్ కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ చిత్రం రూపొందనుందనే టాక్ నడుస్తోంది. త్రివిక్రమ్కి పవన్ కళ్యాణ్, వెంకటేష్లతో చాలా సాన్నిహిత్యం ఉంది.
ఇప్పుడు త్రివిక్రమ్.. పవన్, వెంకటేష్ లతో మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ చేస్తున్నాడని సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై త్రివిక్రమ్.. పవన్, వెంకటేష్లతో సంప్రదింపులు జరిపించాడట. వారిద్దరూ ఈ చిత్రం చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుందని అంటున్నారు. గతంలో పవన్ – వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన గోపాల గోపాల చిత్రం మంచి విజయం సాధించడంతో ఇప్పుడు తాజా మల్టీ స్టారర్పై ఆసక్తి నెలకొని ఉంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వకీల్ సాబ్ సినిమాతో మరోసారి సంచలనం సృష్టించిన పవన్.. ఇప్పుడు రీమేక్ చిత్రాలపై ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రస్తుతం పవర్ స్టార్.. మలయాళం రీమేక్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకు రీమేక్గా తెరకెక్కిస్తున్న భీమ్లా నాయక్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో రానా కీలక పాత్రలో నటిస్తుండగా.. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు. త్వరలో త్రివిక్రమ్.. మహేష్ బాబుతో సినిమా చేయనున్న విషయం తెలిసిందే.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…