Ghost Movie : సీనియర్ హీరోలు అందరూ ఇప్పుడు సినిమాలు హిట్ కావాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ ఏం చేసినా సరే వారి సినిమాలు మాత్రం హిట్ను సాధించలేకపోతున్నాయి. ప్రస్తుతం కింగ్ నాగార్జున పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆయన ఈ మధ్య కాలంలో చేసిన అనేక చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే ఈమధ్యే ఆయన నటించిన బంగార్రాజు మూవీ వచ్చింది. ఇది హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే ఇది ఆయన పూర్తి స్థాయి చిత్రం కాదు. ఇందులో నాగచైతన్యకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కనుక ఈ మూవీ చైతూ ఖాతాలోనే పడింది.
ఇక ఆయన నటించిన మన్మథుడు 2, వైల్డ్ డాగ్ సినిమాలు అయితే అడ్రస్ లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే నాగార్జున మరోమారు ది ఘోస్ట్ పేరిట మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీనికి ప్రవీణ్ సత్తారు దర్శకుడు. ఈ క్రమంలోనే ఈ మూవీ షూటింగ్ను అయితే ఎట్టకేలకు పూర్తి చేశారు. టీజర్ కూడా లాంచ్ కానుంది. ఇక చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను ప్రారంభించాలని భావిస్తోంది. అయితే ఈ మూవీకి ఎలాంటి బజ్ లేదు. ప్రేక్షకుల్లో అంత ఆసక్తి కూడా లేదు. ఆయన గత చిత్రం వైల్డ్ డాగ్ లాగే ది ఘోస్ట్ కూడా ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలోనే సినిమాకు ఎలాంటి బజ్ లేకపోవడంపై నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.
అయితే ప్రస్తుత తరుణంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా నాగ్ ది ఘోస్ట్ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. కానీ ముందుగా చిత్రంపై కాస్త బజ్ పెంచుతారని తెలుస్తోంది. దీంతో కాస్త ఎక్కువ ధరకే ఓటీటీ సంస్థలు ఈ మూవీని కొనేందుకు ఆసక్తిని చూపిస్తాయి. అందులో భాగంగానే అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఘోస్ట్ మూవీ నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతుందని అంటున్నారు. అసలే పరిస్థితులు బాగా లేవు. థియేటర్లలో రిలీజ్ చేసి నష్టాలను ఎందుకు చవిచూడాలి.. అనుకుంటున్నారో ఏమో.. ఘోస్ట్ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై త్వరలోనే వివరాలను వెల్లడించనున్నారని సమాచారం.
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…