Ghost Movie : సీనియర్ హీరోలు అందరూ ఇప్పుడు సినిమాలు హిట్ కావాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ ఏం చేసినా సరే వారి సినిమాలు మాత్రం హిట్ను సాధించలేకపోతున్నాయి. ప్రస్తుతం కింగ్ నాగార్జున పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆయన ఈ మధ్య కాలంలో చేసిన అనేక చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే ఈమధ్యే ఆయన నటించిన బంగార్రాజు మూవీ వచ్చింది. ఇది హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అయితే ఇది ఆయన పూర్తి స్థాయి చిత్రం కాదు. ఇందులో నాగచైతన్యకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కనుక ఈ మూవీ చైతూ ఖాతాలోనే పడింది.
ఇక ఆయన నటించిన మన్మథుడు 2, వైల్డ్ డాగ్ సినిమాలు అయితే అడ్రస్ లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే నాగార్జున మరోమారు ది ఘోస్ట్ పేరిట మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీనికి ప్రవీణ్ సత్తారు దర్శకుడు. ఈ క్రమంలోనే ఈ మూవీ షూటింగ్ను అయితే ఎట్టకేలకు పూర్తి చేశారు. టీజర్ కూడా లాంచ్ కానుంది. ఇక చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను ప్రారంభించాలని భావిస్తోంది. అయితే ఈ మూవీకి ఎలాంటి బజ్ లేదు. ప్రేక్షకుల్లో అంత ఆసక్తి కూడా లేదు. ఆయన గత చిత్రం వైల్డ్ డాగ్ లాగే ది ఘోస్ట్ కూడా ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలోనే సినిమాకు ఎలాంటి బజ్ లేకపోవడంపై నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.
అయితే ప్రస్తుత తరుణంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా నాగ్ ది ఘోస్ట్ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. కానీ ముందుగా చిత్రంపై కాస్త బజ్ పెంచుతారని తెలుస్తోంది. దీంతో కాస్త ఎక్కువ ధరకే ఓటీటీ సంస్థలు ఈ మూవీని కొనేందుకు ఆసక్తిని చూపిస్తాయి. అందులో భాగంగానే అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఘోస్ట్ మూవీ నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతుందని అంటున్నారు. అసలే పరిస్థితులు బాగా లేవు. థియేటర్లలో రిలీజ్ చేసి నష్టాలను ఎందుకు చవిచూడాలి.. అనుకుంటున్నారో ఏమో.. ఘోస్ట్ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై త్వరలోనే వివరాలను వెల్లడించనున్నారని సమాచారం.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…