Pavitra Lokesh : గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్లకు చెందిన వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం విదితమే. నరేష్, పవిత్ర ఇద్దరూ మైసూర్లోని ఓ హోటల్లో నరేష్ భార్య రమ్య రఘుపతికి పట్టుబడ్డారు. దీంతో వీరి వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. అప్పటి వరకు గుట్టుగా ఉన్న వీరి సంబంధాన్ని వీరే బయటకు చెప్పి అంగీకరించాల్సి వచ్చింది. దీంతో వీరు తమ పరువు మొత్తం పోగొట్టుకున్నట్లు అయింది.
ఇక నరేష్ భార్య రమ్య రఘుపతి మాట్లాడుతూ.. తనను నరేష్ గన్తో బెదిరిస్తూ విడాకులు కావాలని అంటున్నాడని.. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేసింది. అలాగే నరేష్ మాట్లాడుతూ.. తన భార్యకు ఎంతో మందితో అక్రమ సంబంధాలు ఉన్నాయని తెలిపారు. పవిత్ర లోకేష్ అయితే ఏకంగా.. నరేష్కు, తనకు ఉన్న సంబంధం గురించి కృష్ణ ఫ్యామిలీ అందరికీ తెలుసని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటాం అని స్పష్టం చేసింది. దీంతో వీరిపై రోజుకో వార్త వస్తోంది.
అయితే నరేష్, పవిత్ర లోకేష్లు కలసి ఎన్నో సినిమాల్లో నటించారు. కానీ వీరి మధ్య ఉన్న బంధం బయటపడ్డాకే అసలు విషయం తెలిసింది. నరేష్ తాను నటించే సినిమాల్లో పవిత్రకు కావాలనే ఒక క్యారెక్టర్ ఇప్పించే వారని ఇప్పుడు అర్థమవుతోంది. ఇక వీరి మధ్య నాలుగేళ్ల కిందటి నుంచే బంధం ఉన్నట్లు స్పష్టమవుతోంది. అందుకు బలం చేకూర్చేలా ఓ మూవీలో ఓ సీన్ కూడా ఉంది. అందులో వీరి రొమాన్స్ చూస్తే అప్పటి నుంచే వీరు సహజీవనం చేస్తున్నారా.. అన్న సందేహం కలగక మానదు.
అప్పట్లో సుధీర్ బాబు, అదితి రావు హైదరి చేసిన సినిమా సమ్మోహనం. ఈ మూవీ 2018 జూన్ 15వ తేదీన రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను తెచ్చుకుంది. ఇందులో నరేష్, పవిత్ర లోకేష్లు కూడా నటించారు. ఓ సీన్లో వీరిద్దరి మధ్య రొమాన్స్ ఒక రేంజ్లో ఉంటుంది. అందులో ఇంటికి వచ్చిన హీరోయిన్కు హీరో ఇల్లు చూపించేందుకు తీసుకెళ్తాడు. అక్కడే ఉన్న పవిత్ర లోకేష్ నరేష్తో.. రొమాంటిక్గా మాట్లాడుతుంది. అయితే తాజాగా వీరి విషయం బయటకు రావడంతో అప్పటి ఆ సినిమాలోని సీన్ను మళ్లీ వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ సినిమా నుంచే.. అంటే.. 4 ఏళ్ల నుంచే నరేష్, పవిత్రల మధ్య వ్యవహారం నడుస్తుందని అంటున్నారు. ఇక ఇందులో నిజం ఎంత ఉంది.. అన్నది తెలియాల్సి ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…