Priya Anand : భారతీయులకు.. అందులోనూ దక్షిణాది వారికి నిత్యానంద స్వామి గురించి బాగా తెలుసు. ఈయన అప్పట్లో తన ప్రవచనాలతో ఎంతో మంది భక్తులను సొంతం చేసుకున్నారు. అయితే ఈయన లీలలు ఎక్కువైపోయాయి. అప్పట్లో ఈయన పాల్పడిన అకృత్యాలకు గాను ఈయనపై ఫిర్యాదులు ఎక్కువై కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో ఈయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది. అయితే ఇక అరెస్టు చేయడమే తరువాయి అనుకుంటున్న సమయంలో దేశం విడిచి పారిపోయాడు. తరువాత ఎక్కడో దీవి కొనుక్కుని దానికి తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. దానికి సొంత భాష, కరెన్సీ తదితర అన్నింటినీ ఏర్పాటు చేసుకున్నాడు. అయితే నిత్యానందుడు ప్రస్తుతం మన దేశంలో లేకపోయినా తరచూ వార్తల్లో అయితే నిలుస్తున్నాడు.
తాజాగా ఈయన మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే అది ఈయన వల్ల కాదు.. ఒక హీరోయిన్ వల్ల. అవును.. మీకు ప్రియా ఆనంద్ తెలుసు కదా. అప్పట్లో ఈమె రానా నటించిన లీడర్ అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. తరువాత రామ రామ కృష్ణ కృష్ణ, 180, కో అంటే కోటి వంటి చిత్రాల్లో నటించింది. కానీ అవేవీ హిట్ కాలేదు. దీంతో ఈమె సినిమాలకు దూరంగానే ఉంటోంది. ప్రస్తుతం ఈమెకు ఆఫర్లు కూడా పెద్దగా లేవు.
అయితే ప్రియా ఆనంద్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను తాను దేవుడిగా ప్రకటించుకున్న నిత్యానందుడిని పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ నిత్యానంద అంటే తనకు బాగా ఇష్టమని చెప్పింది. అంతేకాదు.. ఆయనను పెళ్లి చేసుకుంటానని కూడా తెలియజేసింది. దీంతో ఉన్నట్లుండి ఈమె చేసిన కామెంట్స్కు అందరూ షాకవుతున్నారు. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని ఈమె ఇంత ఓపెన్గా చెప్పిందేమిటా.. అని అందరూ షాక్కు గురవుతున్నారు. ఆమె అలా ఎందుకు మాట్లాడిందని చర్చించుకుంటున్నారు. అవున్లే.. ఎవరికి ఎవరు నచ్చుతారో ఎవరికీ తెలియదు కదా.. ఎవరిష్టం వారిది.. ఎవరినీ ఏమీ అంటానికి లేదు..!
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…