Nagababu : తన కుమార్తె నిహారిక వ్యవహారం ఏమోగానీ.. మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య చాలా సైలెంట్ అయిపోయారు. అంతకు ముందు చిన్న విషయాలకే ఆయన స్పందించేవారు. వారు అలా ఉండాలి.. ఇలా ఉండాలి.. అంటూ చెప్పేవారు. ఓ వైపు రాజకీయాల్లో పాల్గొంటూనే మరోవైపు సినిమాలు, టీవీ షోలు చేసేవారు. అయితే కొంత కాలం కిందట ఆయన ఓ లేఖ విడుదల చేశారు. ఇకపై తన జీవితం ప్రజా సేవకే అంకితమని చెప్పారు. దీంతో ఆయన సినిమాలు, టీవీ షోలను వదిలేసి పూర్తిగా రాజకీయాలకే అంకితం కానున్నారా ? అయితే ఆయన ఎప్పటి నుంచి అలా చేస్తారు ? అన్న ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఆ సమయం ఆసన్నమైందని తెలుస్తోంది. అందుకు ఆయన ధరించిన తాజా గెటప్పే కారణమని చెప్పవచ్చు.
నాగబాబు అంటే మనకు చాలా స్టైలిష్గా కనబడే వ్యక్తి. పెళ్లికి ఎదిగిన కుమారుడు, పెళ్లయిన కుమార్తె ఉన్నప్పటికీ ఇప్పటికీ ఆయన యంగ్గానే కనిపిస్తారు. స్టైలిష్ గా ఉంటారు. కానీ ఆయన తాజా లుక్ అందరినీ షాక్కు గురిచేస్తోంది. అందులో ఆయన భిన్నంగా కనిపించారు. వైట్ అండ్ వైట్ దుస్తుల్లో.. తెల్లని గడ్డం, మీసాలు.. కళ్లకు అద్దాలు.. ఇలా ఆయన పక్కా రాజకీయ నేతగా మారారు. ఈ క్రమంలోనే ఆయన రానున్న రోజుల్లో రాజకీయాల్లో మరింత చురుగ్గా పాల్గొంటారని తెలుస్తోంది. వాస్తవానికి 2019 ఎన్నికల్లో జనసేన ఓటమి పాలైనప్పటి నుంచి నాగబాబు అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు. ఈమధ్య కాబోలు.. పార్టీ వేడుకల్లో ఆయన పవన్తో కలిసి సందడి చేశారు. దీంతో ఆయన మళ్లీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనబోతున్నారనే అనుమానాలు ఏర్పడ్డాయి. వాటికి బలం కలిగేలా ఆయన తాజా తన లుక్ను కూడా పొలిటికల్ లీడర్లా మార్చేశారు. దీంతో నేడో రేపో ఆయన మీడియా ముందుకు వస్తారని కూడా అంటున్నారు.
ఇక నాగబాబు కూడా జనసేన నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడారు. కానీ అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొన్నది లేదు. కానీ టీవీ షోలు, సినిమాలకు మాత్రం పూర్తి సమయం కేటాయించారు. ఇటీవల ఆయన విడుదల చేసిన లేఖతో ఆయన ఇక రాజకీయాలకే అంకితమవుతారనే విషయం స్పష్టమైంది. మరి నాగబాబు రాజకీయాల కోసమే తన లుక్ను ఇలా మార్చారా.. లేదా.. అందుకు వేరే ఏదైనా కారణం ఉందా.. అన్న వివరాలు త్వరలో తెలియనున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…