Nagababu : తన కుమార్తె నిహారిక వ్యవహారం ఏమోగానీ.. మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య చాలా సైలెంట్ అయిపోయారు. అంతకు ముందు చిన్న విషయాలకే ఆయన స్పందించేవారు. వారు అలా ఉండాలి.. ఇలా ఉండాలి.. అంటూ చెప్పేవారు. ఓ వైపు రాజకీయాల్లో పాల్గొంటూనే మరోవైపు సినిమాలు, టీవీ షోలు చేసేవారు. అయితే కొంత కాలం కిందట ఆయన ఓ లేఖ విడుదల చేశారు. ఇకపై తన జీవితం ప్రజా సేవకే అంకితమని చెప్పారు. దీంతో ఆయన సినిమాలు, టీవీ షోలను వదిలేసి పూర్తిగా రాజకీయాలకే అంకితం కానున్నారా ? అయితే ఆయన ఎప్పటి నుంచి అలా చేస్తారు ? అన్న ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఆ సమయం ఆసన్నమైందని తెలుస్తోంది. అందుకు ఆయన ధరించిన తాజా గెటప్పే కారణమని చెప్పవచ్చు.
నాగబాబు అంటే మనకు చాలా స్టైలిష్గా కనబడే వ్యక్తి. పెళ్లికి ఎదిగిన కుమారుడు, పెళ్లయిన కుమార్తె ఉన్నప్పటికీ ఇప్పటికీ ఆయన యంగ్గానే కనిపిస్తారు. స్టైలిష్ గా ఉంటారు. కానీ ఆయన తాజా లుక్ అందరినీ షాక్కు గురిచేస్తోంది. అందులో ఆయన భిన్నంగా కనిపించారు. వైట్ అండ్ వైట్ దుస్తుల్లో.. తెల్లని గడ్డం, మీసాలు.. కళ్లకు అద్దాలు.. ఇలా ఆయన పక్కా రాజకీయ నేతగా మారారు. ఈ క్రమంలోనే ఆయన రానున్న రోజుల్లో రాజకీయాల్లో మరింత చురుగ్గా పాల్గొంటారని తెలుస్తోంది. వాస్తవానికి 2019 ఎన్నికల్లో జనసేన ఓటమి పాలైనప్పటి నుంచి నాగబాబు అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు. ఈమధ్య కాబోలు.. పార్టీ వేడుకల్లో ఆయన పవన్తో కలిసి సందడి చేశారు. దీంతో ఆయన మళ్లీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనబోతున్నారనే అనుమానాలు ఏర్పడ్డాయి. వాటికి బలం కలిగేలా ఆయన తాజా తన లుక్ను కూడా పొలిటికల్ లీడర్లా మార్చేశారు. దీంతో నేడో రేపో ఆయన మీడియా ముందుకు వస్తారని కూడా అంటున్నారు.
ఇక నాగబాబు కూడా జనసేన నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడారు. కానీ అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొన్నది లేదు. కానీ టీవీ షోలు, సినిమాలకు మాత్రం పూర్తి సమయం కేటాయించారు. ఇటీవల ఆయన విడుదల చేసిన లేఖతో ఆయన ఇక రాజకీయాలకే అంకితమవుతారనే విషయం స్పష్టమైంది. మరి నాగబాబు రాజకీయాల కోసమే తన లుక్ను ఇలా మార్చారా.. లేదా.. అందుకు వేరే ఏదైనా కారణం ఉందా.. అన్న వివరాలు త్వరలో తెలియనున్నాయి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…