IPL 2022 : ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 టోర్నీ 33వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఘన విజయం సాధించింది. మ్యాచ్ చివరి ఓవర్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. చివరి వరకు ముంబైనే గెలుస్తుందని అనుకున్నారు. కానీ చివరి బంతికి ధోనీ ఫోర్ కొట్టాడు. దీంతో విజయం చెన్నైని వరించింది. ఫలితంగా ముంబైపై చెన్నై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. ముంబై బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 155 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో 51 పరుగులతో తిలక్ వర్మ ఒక్కడే ఆకట్టుకున్నాడు. మిగిలిన ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. ఇక చెన్నై బౌలర్లలో ముకేష్ చౌదరి 3 వికెట్లు పడగొట్టగా.. డ్వానె బ్రేవో 2 వికెట్లు తీశాడు. అలాగే మిచెల్ శాన్టనర్, మనీష్ తీక్షణలకు చెరొక వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై ఆరంభం నుంచి తడబడుతూ వచ్చింది. వికెట్లను వరుసగా కోల్పోతూ వచ్చింది. దీంతో ముంబై గెలుస్తుందని భావించారు. కానీ చివర్లో వచ్చిన ధోనీ మెరుపులు మెరిపించడంతో జట్టుకు విజయం ఖాయమైంది. ఈ క్రమంలోనే చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. చెన్నై బ్యాట్స్మెన్లలో అంబటి రాయుడు 40 పరుగులతో ఆకట్టుకోగా.. రాబిన్ ఊతప్ప 30 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. మిగిలిన ఎవరూ రాణించలేదు. ఇక ముంబై బౌలర్లలో డానియెల్ శామ్స్ 4 వికెట్లు పడగొట్టాడు. జయదేవ్ ఉనడ్కట్కు 2, మెరెడిత్కు 1 వికెట్ దక్కాయి. ఇక ఈ మ్యాచ్లో కూడా ఓటమితో ముంబై వరుసగా 7 ఓటముల పాలు అయినట్లు అయింది. ఈ సీజన్లో ముంబై పాయింట్ల పట్టికలో ఇంకా ఖాతా తెరవనే లేదు. ఇక చెన్నై పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. కానీ ఇప్పటికే ఒక మ్యాచ్ లో గెలుపొందిన చెన్నైకి ఇది ఈ సీజన్లో రెండో విజయం. కాగా ఈ జట్టు ప్లేయర్లు ఈ విజయంతో కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. మరి చెన్నై పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…