Naga Chaitanya : టాలీవుడ్ క్యూట్ కపుల్గా ఉన్న నాగచైతన్య, సమంత ఇద్దరూ విడిపోయి ఇప్పటికి 9 నెలలు అవుతోంది. అయితే ఈ ఇద్దరూ విడిపోయిన తరువాత ఎవరి పనుల్లో వారు బిజీగా మారిపోయారు. కానీ సమంత మాత్రం అప్పట్లో మామ్ సెయిడ్ పేరిట అనేక సందేశాలను పోస్ట్ చేసింది. అవన్నీ ఇన్డైరెక్ట్గా చైతూనే టార్గెట్ చేస్తూ ఆమె పెట్టినవే అని అన్నారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ కూడా సమయం, సందర్భం దొరికినప్పుడల్లా సమంతను ఆడుకుంటూనే ఉన్నారు. అయితే ఇంత జరుగుతున్నా చైతూ మాత్రం సైలెంట్గానే ఉన్నాడు తప్ప.. సమంతపై ఏనాడూ కామెంట్స్ చేయలేదు. కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే.. సమంతను చైతూ టార్గెట్ చేసినట్లు అర్థమవుతోంది.
చైతన్య, రాశిఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన థాంక్ యూ మూవీ ఈ నెల 22వ తేదీన రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. కాగా రాశిఖన్నా, చైతూ ఇద్దరూ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా విడుదలైన చిత్ర ట్రైలర్లోని ఓ డైలాగ్ మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది.
థాంక్ యూ ట్రైటర్లో ఓ డైలాగ్ ఉంటుంది. దాన్ని చైతూ చెప్పాడు. ఒక మనిషిని పట్టుకుని వేళ్లాడే ప్రేమ కంటే స్వేచ్ఛగా వదిలెయ్యగలిగే ప్రేమ ఎంతో గొప్పది.. అనే డైలాగ్ ఉంటుంది. అయితే దీన్ని చైతూ సమంతను ఉద్దేశించే చెప్పాడని అంటున్నారు. సినిమాలో కావాలనే ఆ డైలాగ్ పెట్టారని, అలాంటి డైలాగ్స్ మూవీలో ఇంకా ఉన్నాయని అంటున్నారు. అయితే ఒకవేళ చైతూ గనక సమంతను టార్గెట్ చేస్తే అప్పటి నుంచే ఆమెపై ఏదో ఒకటి ఇన్డైరెక్ట్గా పోసి చేసి ఉండేవాడు. కానీ అలా చేయలేదు. మరలాంటప్పుడు ఇప్పుడు సడెన్గా ఎందుకు ఇలా టార్గెట్ చేసి డైలాగ్స్ చెబుతున్నాడు.. అంటే.. ఈ మధ్య చైతూకు, శోభితకు ఒక లవ్ ట్రాక్ ఉందని వార్తలు వచ్చాయి కదా.. వాటిని సమంతనే ప్రచారం చేయించిందని అన్నారు. కనుకనే ఆమెను టార్గెట్ చేస్తూ చైతూ అలా డైలాగ్స్ చెప్పాడని అంటున్నారు.
వాస్తవానికి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ముగిసింది. కానీ చైతూ, శోభితల మధ్య లవ్ ట్రాక్ వార్తలను మొన్నీ మధ్యనే ప్రచారం చేశారు. కాబట్టి పైన చెప్పిన వాదన అసంబద్ధమని అనిపిస్తుంది. కానీ సమంత తనను టార్గెంట్ చేస్తుందని అప్పటి నుంచే మనసులో పెట్టుకున్న చైతూ మూవీలో అలా డైలాగ్స్ ఉండేలా జాగ్రత్త పడ్డాడని సమాచారం. ఈ క్రమంలోనే మూవీ ఇప్పుడు రిలీజ్ అవుతుంది కనుక ఎలాగూ ట్రైలర్ను రిలీజ్ చేయాలి కాబట్టి చేశారు. అందులోని డైలాగ్స్నే ట్రైలర్లోనూ పెట్టారు. కానీ ఇది ఉన్నట్లుండి సమంతను టార్గెట్ చేసినట్లు కాదు. ముందు నుంచి అనుకుంటున్నారేమో ఇప్పుడు వర్కవుట్ చేశారు. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలే. వీటిల్లో నిజం ఎంత ఉంది.. అన్నది తెలియాల్సి ఉంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…